
గ్రేటర్ హైదరాబాద్
ఈనాడు, హైదరాబాద్: పింఛన్దారులకు పీఆర్సీలో ప్రకటించిన పింఛన్, గ్రాట్యుటీ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం కొత్త సంవత్సరం నుంచి చెల్లించనుంది. 2022 ఫిబ్రవరిలో అందే జనవరి పింఛను మొదలు బకాయిలను 36 విడతల్లో అందజేస్తుంది. 2020 ఏప్రిల్ తర్వాత మరణించిన పెన్షనర్ల కుటుంబాలకు మాత్రం బకాయిలను ఏకమొత్తంగా అందిస్తారు. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు (జీవో నెం. 1406) జారీ చేసింది. 2020 పీఆర్సీలో విశ్రాంత ఉద్యోగుల పింఛన్ను ప్రభుత్వం పెంచింది. గ్రాట్యుటీని రూ.12 లక్షల నుంచి రూ.16 లక్షలకు పెంచారు. వీటికి సంబంధించి 2020 ఏప్రిల్ నుంచి 2021 మార్చి 31 వరకు బకాయిలను 36 విడతల్లో చెల్లిస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. ఇందుకు అనుగుణంగా బకాయిలు చెల్లించేందుకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులిచ్చారు. ప్రభుత్వ ఉత్తర్వులపై విశ్రాంత గెజిటెడ్ అధికారుల సంఘం హర్షం వ్యక్తంచేసింది.