
తాజా వార్తలు
1.ప్రగతి భవన్లో నాలుగు స్తంభాలాట ప్రారంభమైంది: బండి సంజయ్
సీఎం కేసీఆర్ దిల్లీ ఎందుకు వెళ్లారో అర్థం కాలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ప్రజల దృష్టి మరల్చేందుకే వెళ్లినట్లు ఆయన ఆరోపించారు. సొంత పనుల కోసమే దిల్లీ వెళ్లారని.. భాజపాను అప్రతిష్ఠ పాలు చేసే కుట్రలు పన్నారని ఆయన విమర్శించారు. నగరంలో రెండో రోజు భాజపా రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి.
2.తెలంగాణలో యథావిధిగా ధాన్యం సేకరణ : కేంద్రం
తెలంగాణలో ధాన్యం సేకరణపై కేంద్రం వివరణ ఇచ్చింది. రాష్ట్రంలో యథావిధిగా ధాన్యం సేకరణ చేపడతామని వెల్లడించింది. గతంలో నిర్ణయించిన కనీస మద్దతు ధరకే ధాన్యం సేకరించనున్నట్లు తెలిపింది. ఈ అంశంపై కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖల మంత్రి పీయూష్ గోయల్ను రాష్ట్ర వ్యవసాయ మంత్రి నిరంజన్రెడ్డి నేతృత్వంలోని బృందం శుక్రవారం కలిసిన విషయం తెలిసిందే.
3.మంత్రి గారూ.. త్రివిక్రమ్కు ట్విటర్ ఖాతా లేదండి..!
సినిమా టిక్కెట్ల ధరల విషయంపై దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరుతో ఇటీవల ఓ ట్వీట్ నెట్టింట్లో చక్కర్లు కొట్టింది. అది త్రివిక్రమే చేశారని అభిప్రాయపడిన ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని శుక్రవారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆ ట్వీట్ గురించి ప్రస్తావించారు. అంతేకాకుండా త్రివిక్రమ్ ట్వీట్ని సీఎం దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. ఈ నేపథ్యంలో సినీ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ స్పందించింది.
4.దేశంలో కొత్తగా 8,318 కేసులు..465 మరణాలు
దేశంలో కరోనా వ్యాప్తి కట్టడిలోనే ఉంది. తాజాగా 9,69,354 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 8,318 మందికి వైరస్ పాజిటివ్గా తేలింది. ముందురోజుతో పోల్చితే కొత్త కేసులు 21 శాతం మేర తగ్గాయి. నిన్న 10,967 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. మొత్తం కేసుల సంఖ్య 3.45 కోట్లకు చేరగా.. వారిలో 3.39 కోట్ల మంది వైరస్ను జయించారని శనివారం కేంద్రం వెల్లడించింది.
5.ఒమిక్రాన్ కలవరం.. ఉన్నతాధికారులతో సమావేశమైన ప్రధాని మోదీ
కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు రేకెత్తిస్తున్న వేళ ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు కీలక సమావేశం నిర్వహించారు. దేశంలో కొవిడ్ పరిస్థితులు, వ్యాక్సినేషన్ ప్రక్రియపై సమీక్ష నిర్వహించేందుకు ఉన్నతాధికారులతో ప్రధాని భేటీ అయ్యారు. కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా, ప్రధాని ముఖ్య కార్యదర్శి పీకే మిశ్రా, కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్, నీతిఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
మన దేశంలో వ్యక్తిగత ప్రయాణాలకు సామాన్యులు ఎక్కువగా ద్విచక్రవాహనాల వైపే మొగ్గుచూపుతారు. తక్కువ ధర, ట్రాఫిక్లో త్వరగా వెళ్లడం, నిర్వహణ ఖర్చులు తక్కువ వంటి అంశాలే అందుకు కారణం. పైగా రద్దీ ఎక్కువగా ఉండే మన మెట్రో నగరాల్లో కార్ల కంటే టూ వీలర్లలో వెళ్తే దాదాపు సగం సమయం ఆదా అవుతోందని పలు నివేదికలు తెలియజేస్తున్నాయి.
7.మోదీజీ ఆ దేశాల నుంచి విమానాలు ఆపండి: కేజ్రీవాల్
దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ ఆందోళనకు గురిచేస్తున్న నేపథ్యంలో ఆ వేరియంట్ భారత్లోకి రాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్రాన్ని కోరారు. ఆయా దేశాల నుంచి తక్షణమే విమానాల రాకపోకలను నిలిపివేయాలని ట్విటర్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్రమోదీని అభ్యర్థించారు.
8.తొలి సెషన్లో రెండు వికెట్లు కోల్పోయిన కివీస్.!
కాన్పూర్ వేదికగా జరగుతుతోన్న మొదటి టెస్టు మూడో రోజు తొలి సెషన్లో కివీస్ రెండు వికెట్లు కోల్పోయింది. ఓవర్ నైట్ బ్యాటర్ విల్ యంగ్ (89) ఔటయ్యాడు. రవిచంద్రన్ అశ్విన్ వేసిన 67వ ఓవర్ తొలి బంతికి అతడు కీపర్కు చిక్కి పెవిలియన్ చేరాడు. దీంతో భారత బౌలర్ల నిరీక్షణకు తెరదించినట్లయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కేన్ విలియమ్సన్ (18), ఓవర్ నైట్ బ్యాటర్ టామ్ లేథమ్ (82)తో కలిసి ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు.
9.రూ.10 వేల కోట్ల ప్రభుత్వ సాయాన్ని తిరస్కరించిన మస్క్!
కంపెనీలను స్థాపిస్తామంటే ఆయా ప్రభుత్వాలు రాయితీలు ఇస్తుంటాయి. సంస్థలు సైతం వాటిని ఆనందంగా స్వీకరిస్తాయి. కొన్ని కంపెనీలైతే.. ప్రభుత్వ సాయం కోసం అర్జీ పెట్టుకుంటాయి. కానీ, ఎలాన్ మస్క్ మాత్రం ఇందుకు భిన్నం. ఫ్యాక్టరీ నిర్మాణానికి సాయం చేస్తామని ప్రభుత్వమే ముందుకు వచ్చినా.. ఆయన మాత్రం దాన్ని తిరస్కరించారు.
10.పునీత్ మరణించే వరకూ ఆ విషయం ఎవరికీ తెలీదు: రాజమౌళి
పునీత్ రాజ్కుమార్ మరణం తనని ఎంతగానో కలచివేసిందని ప్రముఖ దర్శకుడు రాజమౌళి అన్నారు. తాజాగా బెంగళూరుకు చేరుకున్న ఆయన పునీత్ ఇంటికి వెళ్లారు. పునీత్ చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబసభ్యుల్ని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పునీత్ మరణాన్ని తాను ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని అన్నారు.
మరిన్ని
Akhanda: కొవిడ్ వచ్చినా.. దేవుడే దిగి వచ్చినా తెలుగు సినిమా.. ప్రేక్షకుడు ‘తగ్గేదేలే’
TS News: సినీ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి అస్వస్థత
Covid-19: దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఇద్దరికి కొవిడ్.. కొత్త వేరియంట్పై అనుమానం!
suresh babu: ప్రభుత్వాలు ఆదుకున్నది శూన్యం.. థియేటర్నే నమ్ముకున్న వాళ్ల పరిస్థితి ఏంటి?
గో ఫస్ట్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. ప్రయాణికులకు తప్పిన ముప్పు!
Sabarimala: శబరిమలకు వచ్చే చిన్నారులకు ఆర్టీ-పీసీఆర్ తప్పనిసరి కాదు
AP News: ఏపీలో మళ్లీ తెరపైకి జిల్లాల పునర్విభజన?.. 25కు పెరగనున్న జిల్లాలు
International flights: తొందరపడొద్దు.. అంతర్జాతీయ విమానాలపై మరోసారి ఆలోచించండి
Manchu Vishnu: ఆ ఆస్పత్రుల్లో ‘మా’ సభ్యుల చికిత్సకు రాయితీ: మంచు విష్ణు
Kishanreddy: కుటుంబ పార్టీలు దేశానికి, ప్రజా స్వామ్యానికి ప్రమాదకరం: కిషన్రెడ్డి
Nawab Malik: నన్నూ.. అనిల్ దేశ్ముఖ్లాగే ఇరికించాలని చూస్తున్నారు
Ap News: రూ.40కోట్ల సుపారీపై ఈడీ విచారణకు డిమాండ్ చేయాలి: తెదేపా ఎంపీలతో చంద్రబాబు
Param Bir Singh: ముంబయి మాజీ పోలీసు కమిషనర్ పరంబీర్ సింగ్కు సీఐడీ సమన్లు
Omicron: మరిన్ని దేశాలకు ఒమిక్రాన్ వ్యాప్తి.. బయటపడుతున్న కొత్త వేరియంట్ కేసులు
Farm Laws: తొలి రోజే సాగు చట్టాల రద్దు బిల్లు.. ట్రాక్టర్ ర్యాలీపై రైతులు వెనక్కి
TS News: ఆసుపత్రి నుంచి సభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి డిశ్ఛార్జ్
IND vs NZ : ఆధిక్యం టీమ్ఇండియాదే.. కానీ చివర్లో కాస్త తడబాటు
IND vs NZ: అక్షర్ ఐదు వికెట్ల ప్రదర్శన.. భారత్కు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం
Rajasthan: ఆరుగురు అక్కాచెల్లెళ్లకు పెళ్లిచేసి.. గుర్రాలపై ఊరేగించి..!
AP News: చర్చిలకు ఎంపీల్యాడ్స్ నిధుల ఖర్చుపై నివేదిక ఏదీ?: కేంద్రం
AP News: జగన్ ఎవరో బెదిరిస్తే బెదిరిపోయే సీఎం కాదు: వెంకట్రామిరెడ్డి
Tamilnadu Rain: తమిళనాడులో మళ్లీ భారీవర్షాలు.. ఎనిమిది మంది మృతి!
Omicron strain: ‘దక్షిణాఫ్రికా నుంచి వచ్చారా.. క్వారంటైన్లో ఉండండి’
Pragyajaiswal: ప్రగ్యా ప్రమేయం లేకుండానే బంపర్ ఆఫర్ చేజారిందా?
IND vs NZ: లేథమ్ సెంచరీ మిస్.. కివీస్ నడ్డివిరిచిన అక్షర్ పటేల్
Omicron: జిన్ పింగ్కు ఇబ్బంది కలగకూడదని.. ఒమిక్రాన్ అని పేరు పెట్టారట..!
భర్త.. భార్యను కొట్టడం కరెక్టేనా..? భారత మహిళల సమాధానమేంటంటే..?
Winter session: ఆ రోజున పార్టీ ఎంపీలందరూ సభకు రావాల్సిందే.. విప్ జారీ చేసిన భాజపా
Trivikram: మంత్రి గారూ.. త్రివిక్రమ్కు ట్విటర్ ఖాతా లేదండి..!
Modi: ఒమిక్రాన్ కలవరం.. ఉన్నతాధికారులతో సమావేశమైన ప్రధాని మోదీ
Puneeth Rajkumar: పునీత్ మరణించే వరకూ ఆ విషయం ఎవరికీ తెలీదు: రాజమౌళి
IND vs NZ: లేథమ్ సెంచరీ చేస్తే.. టీమ్ఇండియా డీఆర్ఎస్ రద్దు చేయమంటుందేమో! : జిమ్మీ నీషమ్
Road Accident: 120 కి.మీ.స్పీడ్తో చెట్టును ఢీకొన్న కారు..ముగ్గురు అన్నదమ్ముల మృతి
Weather Forecast: నేడూ రేపూ తెలంగాణలో మోస్తరు.. రాయలసీమలో భారీ వర్షాలు!
వలస జీవికి ఎంత కష్టం.. కాలి నడకన హైదరాబాద్ నుంచి అస్సాంకు పయనం
Bigg boss telugu 5: సిరి మీ అమ్మకు నువ్వైనా చెప్పు.. గేమ్ను గేమ్గా ఆడండి
TS News: ఆదిలాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలో ఉత్కంఠ.. తెరాసకు పోటీగా స్వతంత్ర అభ్యర్థి
IND vs NZ: సునీల్ గావస్కర్ ఏం చెప్పాడంటే..! : శ్రేయస్ అయ్యర్
Tim Southee: పాత బంతితో స్వింగ్ రాబట్టేందుకు కష్టపడ్డా: టిమ్ సౌథీ
TS News: తెరాస, కాంగ్రెస్ నుంచి 25 మంది టచ్లో ఉన్నారు: తరుణ్ చుగ్
Social Look: ప్రియాంక- నిక్జొనాస్ రొమాంటిక్ స్టిల్.. అదిరిన కీర్తి టోపీ స్టైల్
Kim: కిమ్ను కాపీ కొడతారా..? లెదర్ కోట్పై ఉత్తర కొరియా నిషేధం!
Rahul Chahar: అంపైర్ నిర్ణయంపై ఆగ్రహం.. సన్గ్లాసెస్ను విసిరికొట్టిన టీమ్ఇండియా బౌలర్
Manchu Lakshmi: మంచు లక్ష్మి, సుధీర్ల ‘హగ్’ వార్.. చూస్తే పొట్టచెక్కలవ్వాల్సిందే!
Ts News: ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం స్పష్టత ఇవ్వలేదు: మంత్రి నిరంజన్రెడ్డి
AP News: కేంద్రం తీవ్ర అన్యాయం చేస్తోంది: ఎంపీ విజయసాయిరెడ్డి
Chandrababu: కష్టపడి పనిచేసే వారికే టికెట్లు.. షో చేసే వారిని పక్కన పెడతా: చంద్రబాబు
Afghanistan: అఫ్గాన్లో దిగజారిన శాంతిభద్రతలు.. వెంట ఆయుధాలకు అనుమతి!
IND vs NZ: కోచ్కిచ్చిన మాటను నిలబెట్టుకున్నా: శ్రేయస్ అయ్యర్