
తెలంగాణ
ఎంసెట్ అగ్రికల్చర్ విద్యార్థుల కోసం నిర్వహణ
ఈనాడు, హైదరాబాద్: ఎంసెట్ అగ్రికల్చర్లో ఉత్తీర్ణులైన విద్యార్థులు బీఫార్మసీతోపాటు మరో మూడు కోర్సు (ఫార్మా డి, బయోటెక్నాలజీ, ఫార్మాస్యూటికల్ ఇంజినీరింగ్)ల్లో చేరేందుకు డిసెంబరు 1 నుంచి కౌన్సెలింగ్ మొదలుకానుంది. ప్రవేశాల కమిటీ కన్వీనర్ నవీన్ మిత్తల్ శనివారం తొలి, చివరివిడత కౌన్సెలింగ్ కాలపట్టికలను విడుదల చేశారు. 4 కోర్సుల్లో కన్వీనర్ కోటా కింద 8,773 సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. డిసెంబరు 10వ తేదీకి మొదటి విడత కౌన్సెలింగ్ పూర్తవుతుందని, 13నుంచి చివరివిడత మొదలవుతుందన్నారు.
తొలి కౌన్సెలింగ్ కాలపట్టిక ఇదీ..
* డిసెంబరు 1-3: ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్
* 3-4వ తేదీ వరకు: ధ్రువపత్రాల పరిశీలన
* 3-5వ తేదీ వరకు: వెబ్ ఆప్షన్లకు అవకాశం
* 7వ తేదీ: సీట్ల కేటాయింపు
* 7-10వ తేదీ వరకు: సెల్ఫ్ రిపోర్టింగ్కు గడువు