
ఆంధ్రప్రదేశ్
బిశ్వభూషణ్ హరిచందన్
ఈనాడు, అమరావతి: రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆదివారం రాత్రి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వెళ్లారు. కొవిడ్ అనంతర(పోస్ట్ కొవిడ్) లక్షణాలు కనిపించడంతో చికిత్స నిమిత్తం ఆయనను తీసుకెళ్లినట్లు తెలిసింది. ఇటీవల ఆయనకు కరోనా సోకడంతో హైదరాబాద్లోని ఏఐజీలో చికిత్స తీసుకుని తిరిగొచ్చారు.