
తాజా వార్తలు
1. ఆ 6 జిల్లాలపై వైద్యారోగ్య శాఖ దృష్టి పెట్టాలి.. కేబినెట్ భేటీలో సీఎం కేసీఆర్
ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ భేటీ కొనసాగుతోంది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వార్తల నేపథ్యంలో కార్యాచరణ, సన్నద్ధతపై వైద్యారోగ్య శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ‘‘రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రుల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు వైద్యారోగ్య శాఖ సమీక్షించాలి. మందులు, టీకాలు, మౌలిక వసతులు సమకూర్చుకోవాలి. జిల్లాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలి. ఆదిలాబాద్, కుమరం భీం, నిర్మల్, మహబూబ్నగర్, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలపై వైద్యారోగ్య శాఖ ప్రత్యేక దృష్టి పెట్టాలి’’ అని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
2. వరదలతో కడప జిల్లాకు భారీ నష్టం: సీఎం జగన్కు వివరణ ఇచ్చిన కేంద్ర బృందం
ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అతలాకుతలమైన వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర బృందం ఏపీ సీఎం జగన్తో ఇవాళ భేటీ అయ్యింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని గురించి సీఎం జగన్కు బృందం వివరించింది. వరద ప్రభావిత జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను కేంద్ర బృందం ప్రశంసించింది. కేంద్ర బృందం తరఫున కునాల్ సత్యార్థి సీఎం జగన్కు వివరాలు వెల్లడించారు.
3. సీఎం కేసీఆర్ మొండి వైఖరితో రైతులకు నష్టం: కిషన్రెడ్డి
సీఎం కేసీఆర్ మొండి వైఖరి వల్ల రాష్ట్రంలోని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్రెడ్డి అన్నారు. దిల్లీలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కౌలు రైతులకు ప్రభుత్వం నుంచి ఏ విధమైన సహాయం అందడం లేదని ఆరోపించారు. గత ప్రభుత్వాలు మే నెలలో పంటల ప్రణాళిక విడుదల చేశాయన్నారు. ఒకసారి పత్తి వద్దన్నారు.. మరోసారి వరి వద్దన్నారు.. వ్యవసాయంపై సీఎం కేసీఆర్కు స్థిరమైన అభిప్రాయం, అవగాహన లేదని విమర్శించారు.
4. జగన్ తీరు.. అప్పులతో ఏపీ బ్రాండ్ దెబ్బతింటోంది: చంద్రబాబు
ఏపీలో వచ్చిన వరదల్లో చనిపోయినవారివి కచ్చితంగా ప్రభుత్వ హత్యలేనని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ముంపు ప్రాంతాలకు వెళితే సహాయక కార్యక్రమాలకు ఆటంకమంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు ఆయన చేతగానితనానికి నిదర్శనమన్నారు. వరద నిర్వహణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. పార్టీ ముఖ్యనేతలతో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు.
5. కేంద్రం జాతీయ ధాన్యం సేకరణ విధానం ప్రకటించాలి: తెరాస ఎంపీలు
కేంద్ర ప్రభుత్వం జాతీయ ధాన్యం సేకరణ విధానాన్ని ప్రకటించాలని తెరాస ఎంపీలు డిమాండ్ చేశారు. అభివృద్ధి చెందుతోన్న రాష్ట్రాలకు న్యాయం చేయాలని కోరారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా ఉభయసభలు వాయిదా పడిన అనంతరం తెరాస ఎంపీలు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఫ్లకార్డులు ప్రదర్శించారు. అనంతరం తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, ఎంపీలు మీడియాతో మాట్లాడారు.
6. సమ్మె బాటలో స్విగ్గి డెలివరీ బాయ్స్
స్విగ్గి డెలివరీ బాయ్స్ సమ్మె బాట పట్టారు. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు ఆర్డర్లు తీసుకునేది లేదని స్పష్టం చేశారు. పెరిగిన పెట్రోల్, నిత్యావసర ధరలతో ఇంటి అద్దెలు, స్కూల్ ఫీజులు సైతం చెల్లించలేకపోతున్నామని వాపోతున్నారు. స్విగ్గి యాజమాన్యం గతంలో లాగా మినిమం బేస్ ఫెయిర్ను రూ.35 చెల్లించాలని, దూర ప్రాంత డెలివరీలకు ఇప్పుడు ఇస్తున్న రూ.6ను రూ.12కు పెంచాలని కోరుతున్నారు.
7. అరగంటలో సూచీల్లో ఒమిక్రాన్ ఆందోళన మాయం!
ఈరోజు ఉదయం దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలను వెంటాడిన కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయాలు ఎంతోసేపు నిలవలేదు. కేవలం అరగంటలోపే సూచీలు ఆ ఆందోళన నుంచి బయటకు వచ్చేశాయి. దేశీయంగా ఉన్న సానుకూల సంకేతాలను అందిపుచ్చుకున్నాయి. మరోవైపు దీర్ఘకాలంలో భారత మార్కెట్లపై మదుపర్లు బుల్లిష్గా ఉన్న నేపథ్యంలో కనిష్ఠాల వల్ల కొనుగోళ్ల తాకిడి పెరిగింది. దీంతో సూచీలు భారీగా పుంజుకున్నాయి.
8. సాగుచట్టాల రద్దు.. ఒకేరోజు ఉభయసభలు ఆమోదం!
సాగు చట్టాల రద్దుకు లోక్సభ ఆమోదం తెలిపిన కొన్ని గంటల్లోనే.. కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లులను రాజ్యసభలోనూ ప్రవేశపెట్టింది. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ సాగు చట్టాల రద్దు బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా దీనిపై చర్చ జరగాలని రాజ్యసభలోనూ విపక్షాలు పట్టుబట్టాయి. ఇందుకు రాజ్యసభ ఛైర్మన్ అనుమతించలేదు. అనంతరం మూజువాణి పద్ధతిలో సాగు చట్టల రద్దుకు సంబంధించిన మూడు బిల్లులకు రాజ్యసభ ఆమోదం తెలిపింది.
9. రాజ్యసభలో 12మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు!
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే పలువురు విపక్ష ఎంపీలకు రాజ్యసభలో గట్టి షాక్ తగిలింది. గత వర్షాకాల సమావేశాల్లో సభలో అనుచితంగా, హింసాత్మక ధోరణితో ప్రవర్తించిన పలువురు ఎంపీలపై రాజ్యసభ క్రమశిక్షణా చర్యల కింద వేటు వేసింది. ఈ మేరకు కాంగ్రెస్ సహా పలు పార్టీలకు చెందిన 12మంది ఎంపీలను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది.
10. IND vs NZ: తొలి టెస్టు డ్రా..
కాన్పూర్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు టెస్టు డ్రాగా ముగిసింది. చివరి రోజు ఆఖరి సెషన్లో గొప్పగా పుంజుకున్న భారత బౌలర్లు.. ఐదు వికెట్లు పడగొట్టారు. మరో వికెట్ తీసి ఉంటే భారత్ ఘన విజయం సాధించేదే! అయితే, కివీస్ టెయిలెండర్లు అజాజ్ పటేల్ (2: 23 బంతుల్లో) రచిన్ రవీంద్ర (18: 91 బంతుల్లో 2 ఫోర్లు) జాగ్రత్తగా ఆడుతూ టీమ్ఇండియా విజయాన్ని అడ్డుకున్నారు. దీంతో భారత్ తొలి టెస్టుని డ్రాగా ముగించాల్సి వచ్చింది.
సైనికాధికారులతో జిన్పింగ్ భేటీ.. తైవాన్పైకి యుద్ధవిమానాలు..!
మరిన్ని
Rakesh Tikait: సాగుచట్టాల రద్దు ఓకే.. ఇక ఇతర సమస్యలపై ఉద్యమిస్తాం!
Rahul Gandhi: ‘చర్చలకు అనుమతి ఇవ్వకుంటే పార్లమెంట్ ప్రయోజనం ఏంటి?’
Karnataka: హామీ పత్రం ఇస్తేనే టీకా వేసుకుంటా.. కర్ణాటకవాసి వినూత్న డిమాండ్
TS corona update: తెలంగాణలో కొత్తగా 184 కరోనా కేసులు.. ఒకరి మృతి
Omicron: ఇప్పటివరకు.. ఒమిక్రాన్ వేరియంట్ దాఖలాలు భారత్లో లేవ్!
Shashi Tharoor: మహిళా ఎంపీలతో సెల్ఫీ.. వివాదాస్పదమైన శశిథరూర్ కామెంట్స్!
Sivasankar: ముగిసిన శివశంకర్ మాస్టర్ అంత్యక్రియలు.. పాడె మోసిన యాంకర్ ఓంకార్
Covaxin: విదేశాలకు ‘కొవాగ్జిన్’ ఎగుమతులు ప్రారంభించిన భారత్ బయోటెక్
sirivennela: ‘సిరివెన్నెల’ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల
Omicron: ఒమిక్రాన్ కలకలం.. బోట్స్వానా నుంచి వచ్చిన మహిళ కోసం వేట
Ap corona update: ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 101 కొవిడ్ కేసులు
Mysuru: ఆస్తి కోసం మానవత్వం మరిచి.. మృతదేహం నుంచి వేలిముద్రల సేకరణ
Motorola G31: మాల్వేర్ ప్రొటెక్షన్ ఫీచర్తో మోటో కొత్త ఫోన్!
AP News: బ్యాంకుల్లో నిధులు దాచొద్దు.. ప్రభుత్వ శాఖలకు ఉత్తర్వుల జారీ
Bigg Boss Telugu 5: ఫ్రెండ్స్ అయితే నామినేట్ చేయవా?ఏది అనాలనుకున్నా ఆలోచించి అను..!
IND vs NZ:తొలి టెస్టు డ్రా.. విజయానికి వికెట్ దూరంలో నిలిచిపోయిన భారత్!
Omicron variant: స్కాట్లాండ్లో ఆరుగురిలో ‘ఒమిక్రాన్’ గుర్తింపు
Taiwan: సైనికాధికారులతో జిన్పింగ్ భేటీ.. తైవాన్పైకి యుద్ధవిమానాలు..!
Supreme Court: కృష్ణా ట్రైబ్యునల్ అంశం.. పిటిషన్లపై 13 నుంచి సుప్రీంలో విచారణ
IND vs NZ: ఆరు వికెట్ల దూరంలో టీమ్ఇండియా.. డ్రా దిశగా కాన్పూర్ టెస్ట్
Corona: కరోనా క్లస్టర్గా థానె వృద్ధాశ్రమం.. 67 మందికి పాజిటివ్
Dollar Seshadri: శ్రీవారి సేవలపై శేషాద్రి అవగాహన అనన్య సామాన్యం: సీజేఐ
IND vs NZ: తొలి సెషన్ న్యూజిలాండ్దే.. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయిన భారత్
December Smartphones: అదిరే ఫీచర్లతో కొత్త ఫోన్లు వచ్చేస్తున్నాయ్!
Winter session: పార్లమెంటు సమావేశాలు.. అలా ప్రారంభమై.. ఇలా వాయిదా
Modi: అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది
Dollar Seshadri: పదవులతో నిమిత్తం లేకుండా తితిదేకి సేవలందించారు: వెంకయ్య
CJI: మధుమేహ వైద్యానికి రాయితీలివ్వాలి: సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ
Dollar Seshadri: ప్రముఖులు తిరుమల వస్తే డాలర్ శేషాద్రి ఉండాల్సిందే..
IND vs NZ: అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే గెలుస్తాం: కివీస్ కోచ్ రాంచీ
Crime News: అలారం మోగినా వినిపిస్తేనా.. చోరీకి పాల్పడుతూ చిక్కిన వ్యక్తి
Viral: విమానం ల్యాండింగ్ గేర్లో దాక్కుని 1600 కిలోమీటర్ల ప్రయాణం!
Rahane: ఆ నిర్ణయం తీసుకునేందుకు ద్రవిడ్, కోహ్లీ మొగ్గు చూపరేమో! : లక్ష్మణ్
UPTET: వాట్సాప్ గ్రూపుల్లో ప్రశ్నాపత్రం.. ఉత్తర్ప్రదేశ్ టెట్ రద్దు
Twitter: ట్వీట్లతో ఇబ్బంది పెడుతున్నారా.. వారికిలా చెక్ చెప్పేయండి!
Bigg Boss telugu 5: యాంకర్ రవి ఎలిమినేట్.. కాజల్ను సన్నీ సేవ్ చేయడానికి కారణమదే!
sivasankar: ‘సెట్లో డ్యాన్స్ చేస్తూ చచ్చిపోవాలనేదే నా కోరిక’
Omicron variant: కొత్త వేరియంట్పై ఆందోళన.. వారిపై నిఘా పెంచండి!
Shreyas - Dravid : రాహుల్ సర్ నాకు చెప్పింది అదే: శ్రేయస్ అయ్యర్
Sivasankar: ‘మగధీర’ పాటకు 22 రోజులు.. ‘అరుంధతి’ పాటకు 32 రోజులు!
Sivasankar: శివశంకర్ని కలవడం అదే చివరిసారి అవుతుందనుకోలేదు: చిరంజీవి
punjab elections: సవాళ్లు విసురుకుంటున్న ఆప్.. కాంగ్రెస్ పార్టీలు!
New Variant: ఒమిక్రాన్లో 30కిపైగా మ్యుటేషన్లు.. ప్రమాదకరమే!
Shreyas Iyer: శ్రేయస్ అరుదైన ఫీట్.. తొలి భారతీయ క్రికెటర్గా రికార్డు
Social Look: అమెరికాలో ‘లైగర్’ గ్యాంగ్.. అదాశర్మ ఫొటో తీస్తే!
AP News: ఏపీలో ఉద్యోగ సంఘాల పోరుబాట.. కార్యాచరణ ప్రకటించిన నేతలు
Samantha: చిరుగులు.. పిన్నీసుల డ్రెస్! సామ్ కొత్త ఫొటోలు వైరల్
త్రిపుర స్థానిక ఎన్నికల్లో భాజపా క్లీన్స్వీప్... తృణమూల్, సీపీఎంకు గట్టి దెబ్బ!
Covid: చైనాకు హెచ్చరిక.. సరిహద్దులు తెరిస్తే రోజుకు 6లక్షల కేసులు!
Gautam Gambhir: గౌతమ్ గంభీర్కు బెదిరింపులు.. వారంలో మూడోసారి!
Bandla Ganesh: నటుడు బండ్ల గణేశ్ ఉదారత.. ప్రశంసలు కురిపిస్తోన్న నెటిజన్లు!
Accident: అంత్యక్రియలకు వెళ్తుండగా ఘోర ప్రమాదం.. 18 మంది మృతి
TS News: ధాన్యం కొనుగోళ్లపై కేంద్రాన్ని ప్రశ్నించాలి: కేసీఆర్