
గ్రేటర్ హైదరాబాద్
ఈనాడు, హైదరాబాద్: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(ఐఐసీటీ) డైరెక్టర్ డాక్టర్ శ్రీవారి చంద్రశేఖర్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ(డీఎస్టీ) కార్యదర్శిగా నియమితులయ్యారు. కేంద్ర క్యాబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ కార్యాలయం నుంచి ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో ఉంటారు. శ్రీవారి చంద్రశేఖర్ ప్రస్తుతం ఐఐసీటీతోపాటు నాగ్పుర్లోని జాతీయ పర్యావరణ ఇంజినీరింగ్ పరిశోధన సంస్థకు ఇన్ఛార్జ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. కొవిడ్పై ఆయన నేతృత్వంలో ఐఐసీటీ పునర్వినియోగ ఔషధాలను అందుబాటులోకి తీసుకురావడంతోపాటు కొవిడ్ టీకా అభివృద్ధిలో తోడ్పాటు అందించింది. చంద్రశేఖర్ను ఐఐసీటీ శాస్త్రవేత్తలు, ఉద్యోగులు అభినందించారు.