
తాజా వార్తలు
1. Omicron: 6 వారాలు కీలకం
రాష్ట్రంలో వచ్చే ఆరు వారాలు అత్యంత కీలకమని, ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రజారోగ్య సంచాలకులు (డీహెచ్) డాక్టర్ జి.శ్రీనివాసరావు సూచించారు. జనవరి 15 తరువాత రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగే అవకాశముందని, ఫిబ్రవరి నాటికి తీవ్రత మరింత ఎక్కువ కావచ్చని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో ప్రతిఒక్కరూ మాస్కు ధరించాలని సూచించారు. అర్హులు రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరారు.
2. తెలంగాణలో కొత్తగా 11 ఆటోనగర్లు
రాష్ట్రంలో వాహనాల సంఖ్య, క్రయవిక్రయాలు ఏటేటా పెరుగుతున్నాయి. ఈ రంగానికి ఊతమిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 11 ఆటోనగర్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. హైదరాబాద్ నుంచి ముంబయి, బెంగళూరు, నాగ్పుర్ జాతీయ రహదారుల వెంబడి ఒక్కోటి చొప్పున 3, మరో 8 పట్టణాలకు వీటిని మంజూరు చేసింది. జాతీయ రహదారుల వెంబడి యూనిట్లకు 30 ఎకరాలు, పట్టణాల్లో 10 ఎకరాల చొప్పున కేటాయించింది.
3. ఆ ఉద్యోగ ప్రకటనలను నమ్మి మోసపోవద్దు: తితిదే
తితిదేలో ఉద్యోగాల భర్తీ పేరిట సామాజిక మాధ్యమాల్లో వస్తున్న అవాస్తవ ప్రకటనలను నమ్మి మోసపోవద్దని తితిదే హెచ్చరించింది. ‘ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొందరు దళారులు మోసపూరిత మాటలు చెప్పి గతంలో కొంతమంది అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేశాం. తితిదేలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టేటప్పుడు ముందుగా పత్రికల్లో, తితిదే వెబ్సైట్లో అధికారిక ప్రకటన విడుదల చేస్తాం’అని తితిదే స్పష్టం చేసింది.
అన్నమయ్య, పింఛ జలాశయాల వరద కట్టలు తెగిపోయి పెను విధ్వంసం జరిగిన ఘటనపై ఇంటా బయటా పెనుదుమారం రేగింది. ఈ విషయంలో యంత్రాంగం వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. ఊళ్లకు ఊళ్లు మునిగిపోగా.. ప్రాణనష్టమూ సంభవించింది. కేవలం రెండు, మూడు గంటల్లోనే వచ్చిన అనూహ్య వరద.. ప్రకృతి విపత్తు వల్లే ఈ ప్రమాదం సంభవించిందన్నది అధికారవర్గాల వాదన. కానీ, జలవనరుల రంగంలో ఉన్న నిపుణుల నుంచి భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. సామర్థ్యానికి మించిన వరదతోనే డ్యాంలు తెగిపోవని, నిర్వహణ వైఫల్యాలు కూడా తోడవడమే ఈ పెను ప్రమాదానికి కారణమని వారు అంటున్నారు.
5. త్వరలో 100 ఈవీ ఛార్జింగ్ కేంద్రాలు
ఏపీలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు దిల్లీ, గుజరాత్లకు చెందిన టైరెక్స్, స్టాటిక్ సంస్థలు ఆసక్తి చూపాయి. జనవరి నాటికి ఈ రెండు సంస్థలు కలిసి కనీసం వంద కేంద్రాలను ఏర్పాటు చేయనున్నాయి. ఈ సంస్థలతో నెడ్క్యాప్ కొద్ది రోజుల్లో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకోనుంది. ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు ఇటీవల నెడ్క్యాప్ ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటన (ఈవోఐ) జారీ చేసింది.
6. ఎంఎంటీఎస్ రైళ్ల సమయాల్లో మార్పు
ప్రజా రవాణాలో అతి తక్కువ టిక్కెట్ ధరతో అందుబాటులో ఉన్న ప్రయాణ వనరు మరింత పెరిగింది. కేవలం రూ.5 టిక్కెట్తో 20 కి.మీ, రూ.10 టిక్కెట్తో 40 కి.మీ. ప్రయాణాన్ని అందిస్తున్న ఎంఎంటీఎస్ సర్వీసులు సోమవారం నుంచి పెరగనున్నాయి. లింగంపల్లి-ఫలక్నుమా, హైదరాబాద్-లింగంపల్లి, సికింద్రాబాద్-హైదరాబాద్ మధ్య నడిచే రైళ్ల సంఖ్య 79కి చేరింది.
7. ‘మాస్క్’ ఉల్లంఘనులపై రూ.131 కోట్ల జరిమానాలు
మాస్క్ నిబంధనను ఉల్లఘించినవారిపై ఈ-పెట్టీ కేసు నమోదు చేయడంపై పోలీసులు దృష్టి సారించారు. గత ఏడాది మార్చి ఆఖరులో లాక్డౌన్ అమలైనప్పటి నుంచే మాస్క్ ధరించకుండా బహిరంగ ప్రదేశాల్లో సంచరిస్తున్న వారిపై కేసుల నమోదుకు శ్రీకారం చుట్టారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్లోని 51 సెక్షన్ కింద కేసుల నమోదు ఆరంభించారు. గత ఏడాది 3,26,758 కేసులు నమోదు చేశారు. ఈ ఏడాది 9,89,340 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు మొత్తం రూ.13,16,098 కేసులు నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి.
8. అవినీతిని సహించొద్దు: ఉపరాష్ట్రపతి
పరిపాలనలో అవినీతిని ఏమాత్రం సహించరాదని, అన్ని స్థాయిల్లో సంపూర్ణ పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ప్రజాస్వామ్యానికి అవినీతి చెద పడితే సామాన్యుడికి తీవ్ర నష్టంగా పరిణమిస్తుందన్నారు. ఝార్ఖండ్ మాజీ గవర్నర్, కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి ప్రభాత్ కుమార్ రచించిన ‘పబ్లిక్ సర్వీస్ ఎథిక్స్: ఏ క్వెస్ట్ ఫర్ నైతిక్ భారత్’ పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి ఆదివారం ఆవిష్కరించారు.
9. Omicron: అనంతపురంలో.. ఆ ముగ్గురి పాజిటివ్పై ఉత్కంఠ
ఒమిక్రాన్.. అనే కొవిడ్ వేరియంట్ అనంతపురం జిల్లా జనాల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. జిల్లా పొరుగున బెంగళూరులో ఇద్దరు వ్యక్తుల్లో ఒమిక్రాన్ వైరస్ ఉన్నట్లు తేలిన సంగతి తెలిసిందే. బెంగళూరు-అనంతకు రాకపోకలు నిత్యకృత్యం. దీంతో ఏ రూపంలోనైనా ఆ మహమ్మారి జిల్లాలోకి ప్రవేశిస్తుందన్న భయం ఆవరించింది. జిల్లావాసులు ఎక్కువగా బెంగళూరు, హైదరాబాద్ విమానాశ్రయాల నుంచి విదేశాలకు వెళ్లి వస్తున్నారు.
నాగాలాండ్ వివాదం ఈనాటిది కాదు. దశాబ్దాలుగా ఇది భారత నేలపై విషాన్ని చిమ్ముతూనే ఉంది. భారత్లో అత్యంత సుదీర్ఘ, రక్తసిక్త ఘర్షణగా ఇది నిలిచిపోయింది. దాడులు, ప్రతిదాడులు, శాంతి చర్చలు, కాల్పుల విరమణల నడుమ ఇది కశ్మీర్ వేర్పాటువాదం కన్నా ఎక్కువ కాలం రగిలింది. తాజాగా మాన్ ప్రాంతంలో జరిగిన కాల్పుల ఘటనతో నాగా వివాదం మరోసారి చర్చనీయాంశమైంది. ఆ నెత్తుటి చారికల్ని తడిమిచూసుకునే పరిస్థితుల్ని కల్పించింది.
మరిన్ని
IRCTC Rampath Yatra: ‘రామ్పథ్’ రైలులో కాశీ, అయోధ్య చుట్టొద్దామా..?
Unstoppable: అక్కినేని నాగేశ్వరరావులా మారిన బాలయ్య.. డైలాగ్ అదుర్స్!
IND vs NZ: అతడితో కలిసి బౌలింగ్ చేయడం గొప్ప అనుభూతి: జయంత్ యాదవ్
Supreme Court: మహారాష్ట్ర, బెంగాల్, రాజస్థాన్ ప్రభుత్వాలపై సుప్రీం ఆగ్రహం
TS corona update: తెలంగాణలో కొత్తగా 195 కరోనా కేసులు.. ఒకరి మృతి
Pandemic: తదుపరి మహమ్మారి.. కరోనా కంటే ప్రాణాంతకం కావొచ్చు..!
Windows 11: కొత్త విండోస్లో డీఫాల్ట్ బ్రౌజర్ను ఎలా మార్చాలంటే!
RGIA Hyderabad: ఎట్-రిస్క్ దేశాల నుంచి వచ్చేవారికి ప్రత్యేక ఏర్పాట్లు!
Bigg Boss telugu 5: ఎవరు ఏ స్థానంలో ఉండాలో ఏకాభిప్రాయం వచ్చినట్టేనా?
Bigg Boss 5: ‘బిగ్బాస్’కొచ్చి అలాంటి పనులెందుకు చేస్తా.. మానస్ అలా అంటాడనుకోలేదు!
IND vs NZ: సమష్టి కృషికి ఫలితమిది.. భారత్ విజయంపై దిగ్గజ క్రికెటర్ల స్పందన
Ts News: జగన్ హోదా పెరిగినందున సాక్షులను మరింత ప్రభావితం చేసే అవకాశం: సీబీఐ
WhatsApp: వాట్సాప్ కొత్త ఫీచర్లు.. వెబ్లో రియాక్షన్స్.. యాప్లో బబుల్స్
RRR: ‘ఆర్ఆర్ఆర్’ భీమ్.. రామరాజు కొత్త పోస్టర్లు అదుర్స్
Nagaland Firing: తీవ్రవాదులనే అనుమానంతోనే కాల్పులు.. పొరబాటుకు చింతిస్తున్నాం!
Unstoppable: వెన్నుపోటంటూ తప్పుడు ప్రచారం చేశారు: బాలకృష్ణ భావోద్వేగం
Revanth Reddy: తెరాస ఎంపీలు ప్రజల్ని మభ్యపెడుతున్నారు: రేవంత్రెడ్డి
Myanmar: ఆంగ్ సాన్ సూకీకి నాలుగేళ్ల జైలు.. తీర్పుచెప్పిన మిలిటరీ జుంటా
Omicron: ఒమిక్రాన్తో రీఇన్ఫెక్షన్ ముప్పు.. డెల్టా కంటే అధికంగానే..!
Modi: వ్యాక్సినేషన్లో మరో మైలురాయి.. ఈ వేగాన్ని ఇలాగే కొనసాగిద్దాం : మోదీ
Nagaland: నాగాలాండ్ ఘటనపై నేడు పార్లమెంట్లో అమిత్ షా ప్రకటన
Parliament: ఎంపీల సస్పెన్షన్ వివాదం.. సంసద్ టీవీ నుంచి తప్పుకొన్న శశిథరూర్
Omicron: ఒమిక్రాన్ ప్రభావం స్వల్పమే : ఐఐటీ-కాన్పుర్ ప్రొఫెసర్
Sourav Ganguly: ఒకానొక సమయంలో ద్రవిడ్పై ఆశలు వదులుకున్నాం: గంగూలీ
India Corona: కొత్త కేసులు 8 వేలే.. కానీ కలవరపెడుతోన్న ఒమిక్రాన్
TS News: ర్యాపిడో ప్రకటన వీడియో తొలగించండి: యూట్యూబ్కి కోర్టు ఆదేశం
Axar Patel: ఇది నా ‘డ్రీమ్ ఇయర్’.. అయితే నేర్చుకోవాల్సింది ఇంకా ఉంది: అక్షర్ పటేల్
WhatsApp: వాట్సాప్ ఖాతాను నిషేధించారా..? ఇలా పునరుద్ధరించుకోండి!
Bigg boss telugu 5: ప్రియాంక ఎలిమినేట్.. 90 రోజులు హౌస్లో ఉండటానికి కారణాలివే!
Madhya Pradesh: ‘ఏదో అదృశ్యశక్తి నా ఆహారాన్ని దొంగిలిస్తోంది’
AP News: కొయ్యలగూడెంలో చిన్నారుల మృతి సర్కారు హత్యలే: లోకేశ్
South Africa: ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నా.. ఆస్పత్రి చేరికలు తక్కువే!
IND vs NZ : కివీస్ మాజీ ఆల్రౌండర్ రికార్డును సమం చేసిన అశ్విన్
Crime News: అయిటిపాముల శివారులోని ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
Omicron Effect: వచ్చే రెండు నెలల్లో.. స్వల్ప స్థాయిలో థర్డ్వేవ్!
TS News: థర్డ్వేవ్పై భయం వద్దు.. అప్రమత్తంగా ఉండండి: డీహెచ్ శ్రీనివాస్రావు
AP News: రైతు ఆత్మహత్యల్లో ఏపీది రెండో స్థానం: నాదెండ్ల మనోహర్
Additional Dose: అదనపు డోసు.. డిసెంబర్ 6న నిపుణుల కమిటీ భేటీ!
Ganguly : ఇటీవల కాలంలో టీమ్ఇండియా అత్యంత పేలవ ప్రదర్శన అదే: గంగూలీ
Social Look: ‘గమనం’ గురించి చెప్పిన శ్రియ.. స్కైడ్రైవ్ చేసిన నిహారిక
Nagaland: పౌరులపై భద్రతా బలగాల కాల్పులపై ఆగ్రహం.. ఒటింగ్లో సైనిక శిబిరంపై దాడి
AP News: విశాఖ ఆర్కే బీచ్లో ముందుకొచ్చిన సముద్రం.. పర్యాటకులకు నో పర్మిషన్
AP News: కేంద్ర పథకాలకు సీఎం పేరు ఎలా పెట్టుకుంటారు?: సోము వీర్రాజు
IND vs NZ: కెమెరా వల్ల ఆగిపోయిన మ్యాచ్.. భారత ఆటగాళ్లు ఏం చేశారో చూడండి!
Pushpa: ‘ఇక్కడికి ఎలా వచ్చామో అలానే వెళ్లిపోదాం’.. ‘పుష్ప’ షూట్లో అల్లు అర్జున్!
Tirumala: తిరుమల ఘాట్రోడ్లో కొండచరియలు పరిశీలించిన కేరళ నిపుణుల బృందం
ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం లేదు.. రాజస్థాన్లో వచ్చేది మేమే: అమిత్షా