
తాజా వార్తలు
ఒప్పందంపై రష్యా, భారత్ రక్షణశాఖ మంత్రుల సంతకాలు
దిల్లీ: అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఏకే-203 రైఫిల్స్ కొనుగోలుపై రష్యా, భారత్ల మధ్య ఇటీవలే ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా వీటిని భారత్లోనే తయారు చేసి మన సైన్యానికి అందించే ఒప్పందంపై ఇరు దేశాలు నేడు సంతకాలు చేశాయి. టెక్నాలజీ రష్యాదే అయినప్పటికీ వీటిని ఉత్తర్ప్రదేశ్ అమేఠీలో సంయుక్తంగా తయారు చేసే ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. ఈ ఒప్పందంతో దాదాపు రూ.5వేల కోట్ల విలువైన 6లక్షలకుపైగా ఏకే-203 రైఫిల్లు భారత్లోనే తయారు కానున్నాయి. వీటితో పాటు రానున్న 10ఏళ్లు రక్షణ సహకారంపైనా ఇరుదేశాల రక్షణశాఖ మంత్రులు ఒప్పందం చేసుకున్నారు.
రూ. 5వేల కోట్ల విలువ..
భారత్, రష్యాల మధ్య నేడు జరుగుతోన్న ద్వైపాక్షిక వార్షిక సదస్సులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. ఈ కీలక సమావేశానికి ముందే ఇరు దేశాల రక్షణ, విదేశాంగ శాఖల మంత్రుల ‘2+2 భేటీ’ జరిగింది. ఇందులో భాగంగా రష్యా రక్షణశాఖ మంత్రి సెర్గీ షొయిగుతో భారత రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమావేశమయ్యారు. ముఖ్యంగా సైనిక పరికరాలను ఉత్పత్తిని ఉమ్మడిగా తయారు చేయడంతోపాటు వ్యూహాత్మక సహకారాన్ని మరింత పెంపొందించే మార్గాలపై ఇరువురు మంత్రులు చర్చించారు. వీటితో పాటు కలాష్నికోవ్ ఆయుధాలపై 2019లో జరిగిన ఒప్పందాలకు పలు సవరణలకు అంగీకారం తెలిపారు. ఈ రోజు మొత్తం నాలుగు అంశాలపై ఇరుదేశాలు ఒప్పందం చేసుకోగా వాటిలో అతిముఖ్యమైనది మాత్రం AK-203 రైఫిల్స్ తయారీదేనని అధికార వర్గాలు వెల్లడించాయి.
చర్చల అనంతరం మాట్లాడిన భారత రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్.. రష్యాతో భారత్కు దీర్ఘకాల అనుబంధం ఉండడంతోపాటు ప్రత్యేకమైన వ్యూహాత్మక భాగస్వామి అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వివిధ అంశాల్లో భారత్కు రష్యా అందిస్తోన్న సహకారాన్ని ఆయన ప్రశంసించారు. అయితే ఈ సన్నిహిత సహకారం మాత్రం మరే దేశాన్ని లక్ష్యంగా చేసుకునేందుకు కాదని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు.
ద్వైపాక్షిక వార్షిక సదస్సులో భాగంగా రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్తో భారత విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి ఎస్.జైశంకర్ చర్చలు జరిపారు. అనంతరం చర్చలపై సంతృప్తి వ్యక్తం చేసిన ఎస్. జయశంకర్.. ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయాల్లో వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నప్పటికీ భారత్, రష్యాల మధ్య సంబంధాలు సుస్థిరంగా, బలంగా ఉన్నాయని ఉద్ఘాటించారు.
మరిన్ని
IRCTC Rampath Yatra: ‘రామ్పథ్’ రైలులో కాశీ, అయోధ్య చుట్టొద్దామా..?
Unstoppable: అక్కినేని నాగేశ్వరరావులా మారిన బాలయ్య.. డైలాగ్ అదుర్స్!
IND vs NZ: అతడితో కలిసి బౌలింగ్ చేయడం గొప్ప అనుభూతి: జయంత్ యాదవ్
Supreme Court: మహారాష్ట్ర, బెంగాల్, రాజస్థాన్ ప్రభుత్వాలపై సుప్రీం ఆగ్రహం
TS corona update: తెలంగాణలో కొత్తగా 195 కరోనా కేసులు.. ఒకరి మృతి
Pandemic: తదుపరి మహమ్మారి.. కరోనా కంటే ప్రాణాంతకం కావొచ్చు..!
Windows 11: కొత్త విండోస్లో డీఫాల్ట్ బ్రౌజర్ను ఎలా మార్చాలంటే!
RGIA Hyderabad: ఎట్-రిస్క్ దేశాల నుంచి వచ్చేవారికి ప్రత్యేక ఏర్పాట్లు!
Bigg Boss telugu 5: ఎవరు ఏ స్థానంలో ఉండాలో ఏకాభిప్రాయం వచ్చినట్టేనా?
Bigg Boss 5: ‘బిగ్బాస్’కొచ్చి అలాంటి పనులెందుకు చేస్తా.. మానస్ అలా అంటాడనుకోలేదు!
IND vs NZ: సమష్టి కృషికి ఫలితమిది.. భారత్ విజయంపై దిగ్గజ క్రికెటర్ల స్పందన
Ts News: జగన్ హోదా పెరిగినందున సాక్షులను మరింత ప్రభావితం చేసే అవకాశం: సీబీఐ
WhatsApp: వాట్సాప్ కొత్త ఫీచర్లు.. వెబ్లో రియాక్షన్స్.. యాప్లో బబుల్స్
RRR: ‘ఆర్ఆర్ఆర్’ భీమ్.. రామరాజు కొత్త పోస్టర్లు అదుర్స్
Nagaland Firing: తీవ్రవాదులనే అనుమానంతోనే కాల్పులు.. పొరబాటుకు చింతిస్తున్నాం!
Unstoppable: వెన్నుపోటంటూ తప్పుడు ప్రచారం చేశారు: బాలకృష్ణ భావోద్వేగం
Revanth Reddy: తెరాస ఎంపీలు ప్రజల్ని మభ్యపెడుతున్నారు: రేవంత్రెడ్డి
Myanmar: ఆంగ్ సాన్ సూకీకి నాలుగేళ్ల జైలు.. తీర్పుచెప్పిన మిలిటరీ జుంటా
Omicron: ఒమిక్రాన్తో రీఇన్ఫెక్షన్ ముప్పు.. డెల్టా కంటే అధికంగానే..!
Modi: వ్యాక్సినేషన్లో మరో మైలురాయి.. ఈ వేగాన్ని ఇలాగే కొనసాగిద్దాం : మోదీ
Nagaland: నాగాలాండ్ ఘటనపై నేడు పార్లమెంట్లో అమిత్ షా ప్రకటన
Parliament: ఎంపీల సస్పెన్షన్ వివాదం.. సంసద్ టీవీ నుంచి తప్పుకొన్న శశిథరూర్
Omicron: ఒమిక్రాన్ ప్రభావం స్వల్పమే : ఐఐటీ-కాన్పుర్ ప్రొఫెసర్
Sourav Ganguly: ఒకానొక సమయంలో ద్రవిడ్పై ఆశలు వదులుకున్నాం: గంగూలీ
India Corona: కొత్త కేసులు 8 వేలే.. కానీ కలవరపెడుతోన్న ఒమిక్రాన్
TS News: ర్యాపిడో ప్రకటన వీడియో తొలగించండి: యూట్యూబ్కి కోర్టు ఆదేశం
Axar Patel: ఇది నా ‘డ్రీమ్ ఇయర్’.. అయితే నేర్చుకోవాల్సింది ఇంకా ఉంది: అక్షర్ పటేల్
WhatsApp: వాట్సాప్ ఖాతాను నిషేధించారా..? ఇలా పునరుద్ధరించుకోండి!
Bigg boss telugu 5: ప్రియాంక ఎలిమినేట్.. 90 రోజులు హౌస్లో ఉండటానికి కారణాలివే!
Madhya Pradesh: ‘ఏదో అదృశ్యశక్తి నా ఆహారాన్ని దొంగిలిస్తోంది’
AP News: కొయ్యలగూడెంలో చిన్నారుల మృతి సర్కారు హత్యలే: లోకేశ్
South Africa: ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నా.. ఆస్పత్రి చేరికలు తక్కువే!
IND vs NZ : కివీస్ మాజీ ఆల్రౌండర్ రికార్డును సమం చేసిన అశ్విన్
Crime News: అయిటిపాముల శివారులోని ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
Omicron Effect: వచ్చే రెండు నెలల్లో.. స్వల్ప స్థాయిలో థర్డ్వేవ్!
TS News: థర్డ్వేవ్పై భయం వద్దు.. అప్రమత్తంగా ఉండండి: డీహెచ్ శ్రీనివాస్రావు
AP News: రైతు ఆత్మహత్యల్లో ఏపీది రెండో స్థానం: నాదెండ్ల మనోహర్
Additional Dose: అదనపు డోసు.. డిసెంబర్ 6న నిపుణుల కమిటీ భేటీ!
Ganguly : ఇటీవల కాలంలో టీమ్ఇండియా అత్యంత పేలవ ప్రదర్శన అదే: గంగూలీ
Social Look: ‘గమనం’ గురించి చెప్పిన శ్రియ.. స్కైడ్రైవ్ చేసిన నిహారిక
Nagaland: పౌరులపై భద్రతా బలగాల కాల్పులపై ఆగ్రహం.. ఒటింగ్లో సైనిక శిబిరంపై దాడి
AP News: విశాఖ ఆర్కే బీచ్లో ముందుకొచ్చిన సముద్రం.. పర్యాటకులకు నో పర్మిషన్
AP News: కేంద్ర పథకాలకు సీఎం పేరు ఎలా పెట్టుకుంటారు?: సోము వీర్రాజు
IND vs NZ: కెమెరా వల్ల ఆగిపోయిన మ్యాచ్.. భారత ఆటగాళ్లు ఏం చేశారో చూడండి!
Pushpa: ‘ఇక్కడికి ఎలా వచ్చామో అలానే వెళ్లిపోదాం’.. ‘పుష్ప’ షూట్లో అల్లు అర్జున్!
Tirumala: తిరుమల ఘాట్రోడ్లో కొండచరియలు పరిశీలించిన కేరళ నిపుణుల బృందం
ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం లేదు.. రాజస్థాన్లో వచ్చేది మేమే: అమిత్షా