
తెలంగాణ
ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులుగా కుంభాజడల మన్మథరావు, బొడ్డుపల్లి శ్రీభానుమతి నియమితులయ్యారు. వీరి పేర్లను సూచిస్తూ నవంబరు 11న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం చేసిన సిఫార్సులకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేసినట్లు న్యాయశాఖ సోమవారం ఉత్వర్వులిచ్చింది. మన్మథరావు న్యాయవాద వృత్తిలో ఉండగా... భానుమతి ప్రస్తుతం హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్గా సేవలందిస్తున్నారు.