
గ్రేటర్ హైదరాబాద్
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర జల వనరులు, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థను (టీఎస్డబ్ల్యూఆర్ఐడీసీ) కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ) ‘ఎ’ కేటగిరి కింద గుర్తించింది. 2018లో ఏర్పాటైన ఈ సంస్థ సీతారామ, దేవాదుల ఎత్తిపోతల పథకాలు, కంతనపల్లి ప్రాజెక్టు, వరద కాల్వ (ఎస్సారెస్పీ) పనుల్లో ప్రమాణాల మేరకు నిధులను వినియోగించడంలో ఉత్తమ పనితీరు నమోదు చేసినట్లు ఆర్ఈసీ పేర్కొంది. 2021లో సీతమ్మసాగర్ మల్టీపర్పస్ ప్రాజెక్టును కూడా ఈ కార్పొరేషన్ పరిధిలోకి ప్రభుత్వం తీసుకొచ్చింది. ‘ఎ’ గ్రేడు దక్కించుకున్నందుకు కార్పొరేషన్ ఎండీ బి.శంకర్ను నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్, ఈఎన్సీ మురళీధర్ అభినందించారు.