
గ్రేటర్ హైదరాబాద్
దిల్లీ: నవజోత్ సింగ్ సిద్ధూను మళ్లీ మంత్రి పదవిలోకి తీసుకోవాలని పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ లాబీయింగ్ చేసినట్లు పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ చెప్పారు. ‘‘సిద్ధూను తొలగించిన తర్వాత.. ఉమ్మడి మిత్రుని ద్వారా నాకు ఒక సందేశం వచ్చింది. పాకిస్థాన్ ప్రధానికి సిద్ధూ పాత మిత్రుడనీ, సిద్ధూను తిరిగి కేబినెట్లో తీసుకుంటే కృతజ్ఞతతో ఉంటారని, ఒకవేళ సరైన పనితీరు కనపరచకపోతే అప్పుడు తొలగించాలని అందులో ఉంది’’ అని వివరించారు. ఆ విషయాన్ని కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, ప్రియాంక గాంధీల దృష్టికి తాను తీసుకువెళ్లినట్లు చెప్పారు.