
ఆంధ్రప్రదేశ్
మాజీమంత్రి ఆలపాటి
ఈనాడు డిజిటల్, అమరావతి: ధాన్యం కొనుగోళ్లలో ఎప్పుడూ లేనివిధంగా హమాలీ ఛార్జీలు, గోతాలు, రవాణా ఛార్జీల పేరుతో క్వింటాకు రూ.400 నుంచి రూ.500 వరకు రైతుల నుంచి దోచుకుంటున్నారని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ధ్వజమెత్తారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘ధాన్యం సేకరణ, అమ్మకాల పేరుతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతోందని అధికార పార్టీ ఎంపీనే చెప్పారు. ఈ క్రాప్ నమోదులో 40% వివరాలు సంపూర్ణంగా లేవు. తక్కువ ధరకు ధాన్యం కొంటున్న ప్రభుత్వం ఆ సొమ్మును ఆరు, ఏడు నెలలు గడిచినా చెల్లించకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు’’ అని ఆలపాటి పేర్కొన్నారు.