
దసపల్లా భూములకు రాజకీయ రంగు తగదు
ఇష్టపూర్వకంగానే అష్యూర్ సంస్థతో ఒప్పందం
ఆ కుటుంబసభ్యులు రాణి కమలాదేవి, దిగ్విజయ్ చంద్రదేవ్ భంజ్ వెల్లడి
విశాఖపట్నం(వన్టౌన్), న్యూస్టుడే: దసపల్లా భూములకు రాజకీయ రంగు వేయవద్దని ఆ కుటుంబసభ్యులు రాణి కమలాదేవి, ఆమె కుమారుడు దిగ్విజయ్ చంద్రదేవ్ భంజ్ ఓ ప్రకటనలో కోరారు. ఇష్టపూర్వకంగానే తమ కుటుంబసభ్యులు, ఇతర కొనుగోలుదారులు ఆయా భూములను అభివృద్ధి చేసుకోవడానికి అష్యూర్ డెవలపర్స్ ఎల్ఎల్పీ సంస్థతో సంయుక్తంగా ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలిపారు. ఎటువంటి ఒత్తిడి, బలవంతం లేదని, ఏ రాజకీయ పార్టీ, ముఖ్యంగా విజయసాయిరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులతో తమకు సంబంధాలు లేవని స్పష్టం చేశారు. తమ భూములకు సంబంధించి రాజకీయ నాయకులెవర్నీ సంప్రదించలేదన్నారు. న్యాయస్థానాలు తమ భూములను ప్రైవేటువిగా ప్రకటించాయని చెప్పారు. ఈ సందర్భంగా దసపల్లా భూములకు సంబంధించి న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను ప్రస్తావించారు. దసపల్లా కుటుంబ సభ్యులు, కొనుగోలుదారులు నిషేధిత జాబితా 22ఏ నుంచి భూములను డీనోటిఫై చేయాలని ప్రభుత్వంతో అవిశ్రాంతంగా పోరు సాగిస్తున్నారని వెల్లడించారు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (02/02/23)
-
Sports News
WPL: మహిళల ప్రీమియర్ లీగ్.. ఫిబ్రవరి రెండో వారంలోనే వేలం!
-
Sports News
Usman Khawaja: వీసా ఆలస్యంతో ఆస్ట్రేలియా ఓపెనర్ అసంతృప్తి.. ఫన్నీ పోస్ట్ వైరల్
-
Movies News
Kiara Sidharth Malhotra: కియారా- సిద్ధార్థ్ల వివాహం అప్పుడేనా? శరవేగంగా పనులు..!
-
Movies News
Mukhachitram: విశ్వక్సేన్ ‘ముఖచిత్రం’.. ఓటీటీలోకి వచ్చేస్తోంది!
-
Politics News
CM Kcr-Amith jogi: సీఎం కేసీఆర్తో అమిత్ జోగి భేటీ.. జాతీయ రాజకీయాలపై చర్చ