
వైకాపా కార్యాలయానికి భూ కేటాయింపుపై నిరసన
పాడేరు, న్యూస్టుడే: అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరు శివారులో చింతలవీధి వద్ద రెండెకరాల భూమిని వైకాపా కార్యాలయం ఏర్పాటుకు కేటాయించడంపై స్థానికులు ఆదివారం పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేశారు. సీపీఎం, సీఐటీయూ ఆధ్వర్యంలో గ్రామస్థులు పాడేరు-హుకుంపేట ప్రధాన రహదారిపై బైఠాయించి నినాదాలు చేశారు. వాహనాల రాకపోకలు సుమారు గంటకు పైగా నిలిచిపోయాయి. ఎస్సై లక్ష్మణ్ అక్కడకు చేరుకుని అందోళనకారులకు నచ్చజెప్పి పంచాయతీ కార్యాలయానికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు మాట్లాడుతూ నిరుపేదలకు చెందాల్సిన బంజరు భూములను వైకాపా కార్యాలయానికి ఎలా కట్టబెడతారని ప్రశ్నించారు. తమ పూర్వీకుల నుంచి ఈ భూమిని పశువుల పెంపకం, ఇతర అవసరాలకు వాడుకుంటున్నామన్నారు. దీనిపై కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Usman Khawaja: వీసా ఆలస్యంతో ఆస్ట్రేలియా ఓపెనర్ అసంతృప్తి.. ఫన్నీ పోస్ట్ వైరల్
-
Movies News
Kiara Sidharth Malhotra: కియారా- సిద్ధార్థ్ల వివాహం అప్పుడేనా? శరవేగంగా పనులు..!
-
Movies News
Mukhachitram: విశ్వక్సేన్ ‘ముఖచిత్రం’.. ఓటీటీలోకి వచ్చేస్తోంది!
-
General News
Top 10 Budget Stories: కేంద్ర బడ్జెట్ - 2023 ప్రత్యేక కథనాలు!
-
Movies News
Social Look: సిల్క్స్మితలా దివి పోజు.. మేఘ ‘ప్రేమదేశం’ అప్పుడే
-
Movies News
Kichcha Sudeep: ఆమె చేసిన త్యాగాల వల్లే నేను ఇక్కడ ఉన్నా: కిచ్చా సుదీప్