
గోధుమల ధరలు పెరిగితే చర్యలు చేపడతాం
ఆహార కార్యదర్శి సంజీవ్ చోప్రా
దిల్లీ: గోధుమల ధరలను ప్రభుత్వం పర్యవేక్షిస్తోందని, రిటైల్ మార్కెట్లో అసాధారణంగా ధరలు పెరిగితే తగిన చర్యలు చేపడతామని కేంద్ర ఆహార కార్యదర్శి సంజీవ్ చోప్రా పేర్కొన్నారు. ప్రభుత్వం వద్ద గోధుమలు, బియ్యం నిల్వలు అవసరానికి కంటే అధికంగానే ఉన్నాయని అన్నారు. ‘బియ్యం ధరలు స్తబ్దుగానే ఉన్నాయి. మేలో ఎగుమతులపై నిషేధం విధించిన తర్వాత గోధుమల ధరలు 7 శాతం మేర పెరిగాయి. కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) పెరుగుదలను పరిగణనలోకి తీసుకుంటే ధరల పెరుగుదల 4-5 శాతంగా ఉంది’ అని సంజీవ్ అన్నారు. దేశీయ సరఫరాలు పెంచేందుకు, ధరల నియంత్రణకు ఈ ఏడాది మేలో ప్రభుత్వం గోధుమల ఎగుమతులపై నిషేధం విధించింది. 2022-23 మార్కెటింగ్ సంవత్సరంలో గోధుమల సేకరణ 434.44 లక్షల టన్నుల నుంచి 187.92 లక్షల టన్నులకు పరిమితమైంది. దేశీయ ఉత్పత్తి తగ్గడం, ప్రైవేట్ పార్టీలు అధికంగా కొనుగోళ్లు చేపట్టడం ఇందుకు కారణం.
మరిన్ని
Stellantis: ‘పాశ్చాత్య దేశాలతో చైనా కయ్యం.. భారత్కు ఓ గొప్ప అవకాశం’
Electric motorcycle: 307km రేంజ్తో ఎలక్ట్రిక్ బైక్.. ధర కొంచెం ఎక్కువే!
Amazon: భారత్లో అమెజాన్ కీలక నిర్ణయం.. ఆ ప్లాట్ఫాంను మూసివేస్తున్నట్లు ప్రకటన
Twitter: ఐఫోన్ తొలి హ్యాకర్కు ట్విటర్లో కీలక బాధ్యతలు.. 12 వారాల్లో పని పూర్తిచేయాలన్న మస్క్!


తాజా వార్తలు (Latest News)
-
World News
Easter Attacks: ‘నన్ను క్షమించండి..’ శ్రీలంక మాజీ అధ్యక్షుడు సిరిసేన
-
India News
Khushbu Sundar: వీల్ఛైర్ కోసం 30 నిమిషాలా?.. ఎయిరిండియాపై ఖుష్బూ అసహనం
-
Sports News
PCB: మికీ ఆర్థర్ పాక్ ‘ఆన్లైన్ కోచ్’.. సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువ
-
Technology News
WhatsApp: వాట్సాప్ వీడియో.. ఈ మార్పు గమనించారా..?
-
Movies News
RRR: ఆస్కార్ బరిలో నిలిచిన చిత్రాలను వెనక్కి నెట్టి.. నంబరు 1గా ‘ఆర్ఆర్ఆర్’
-
Politics News
AAP: కర్ణాటకపై ఆప్ గురి: అజెండాపై కసరత్తు.. పార్టీల హామీలపై కౌంటర్!