
EPFO: ఈపీఎఫ్ గరిష్ఠ వేతన పరిమితి ₹21 వేలు..?
దిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO)కు సంబంధించి ప్రభుత్వం త్వరలో ఓ గుడ్న్యూస్ చెప్పే అవకాశం ఉంది. పెన్షన్ స్కీమ్కు సంబంధించి ఉద్యోగుల గరిష్ఠ వేతన పరిమితిని పెంచే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం రూ.15వేలుగా ఉన్న వేతన పరిమితిని రూ.21 వేలకు త్వరలోనే పెంచనుందని వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే ఉద్యోగులు, యజమానులు చెల్లించే వాటా పెరగనుంది. దీనివల్ల ఉద్యోగుల భవిష్యనిధి ఖాతాకు జమ అయ్యే మొత్తం ఆ మేర పెరగనుంది.
ప్రస్తుతం ఈపీఎఫ్ఓ గరిష్ఠ వేతన పరిమితిని చివరిసారిగా 2014లో సవరించారు. అప్పట్లో రూ.6,500గా ఉన్న గరిష్ఠ వేతనాన్ని రూ.15వేలకు పెంచారు. 20 మంది కంటే ఎక్కువ ఉన్న సంస్థలకు మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుంది. తాజాగా ఆ పరిమితిని పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం అధిక వేతనం నిర్ణయించేందుకు ఒక కమిటీని ప్రభుత్వం నియమించే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి ఎప్పటికప్పుడు గరిష్ఠ వేతన పరిమితిని ఈ కమిటీ సమీక్షించనుంది.
సాధారణంగా ఉద్యోగి వాటాగా వేతనంపై 12 శాతం, యజమాని వాటా 12 శాతం చెల్లిస్తారు. ఉద్యోగి వాటా పూర్తిగా ఈపీఎఫ్ ఖాతాలో జమవుతుంది. యజమాని వాటా నుంచి 8.33 శాతం పింఛను పథకంలో, మిగతా మొత్తం ఈపీఎఫ్ ఖాతాలో జమవుతాయి. ప్రస్తుతం ఉన్న గరిష్ఠ వేతన పరిమితి ప్రకారం.. 8.33 శాతం కింద రూ.1250 ఈపీఎస్ ఖాతాలోకి వెళ్తాయి. మిగతా మొత్తం ఉద్యోగి ఖాతాలో జమవుతాయి. గరిష్ఠ వేతన పరిమితి పెరిగితే ఆ మేర ఉద్యోగి వాటా, యజమాని వాటా పెరుగుతుంది. పెన్షన్ ఖాతాలో ఎక్కువ మొత్తం జమ అవుతుంది.
ప్రస్తుతం లెక్కింపు ఇలా..
ఉదాహరణకు ఒక ఉద్యోగి వేతనం (బేసిక్ + డీఏ) రూ.30 వేలు ఉందనుకుందాం. ఇందులో ఉద్యోగి వాటా రూ.3600 ఈపీఎఫ్ ఖాతాలో జమవుతాయి. యజమాని వాటా కింద రూ.3600 ఉంటాయి. గరిష్ఠ వేతన పరిమితి రూ.15 వేలును పరిగణనలోకి తీసుకుంటే.. 8.33 శాతం కింద రూ.1250 ఈపీఎస్ ఖాతాలోకి వెళ్తాయి. మిగతా రూ.2350 ఉద్యోగి ఖాతాలో జమవుతాయి. అంటే నెలకు ఉద్యోగి, యజమాని వాటా కింద ఈపీఎఫ్ ఖాతాలో రూ.5950 ఉంటాయి. గరిష్ఠ పరిమితిని 21వేలు చేస్తే ఆ మేర ఈపీఎస్లో జమ అయ్యే సుమారు రూ.1750కి పెరగనుంది.
మరిన్ని
Stellantis: ‘పాశ్చాత్య దేశాలతో చైనా కయ్యం.. భారత్కు ఓ గొప్ప అవకాశం’
Electric motorcycle: 307km రేంజ్తో ఎలక్ట్రిక్ బైక్.. ధర కొంచెం ఎక్కువే!
Amazon: భారత్లో అమెజాన్ కీలక నిర్ణయం.. ఆ ప్లాట్ఫాంను మూసివేస్తున్నట్లు ప్రకటన
Twitter: ఐఫోన్ తొలి హ్యాకర్కు ట్విటర్లో కీలక బాధ్యతలు.. 12 వారాల్లో పని పూర్తిచేయాలన్న మస్క్!


తాజా వార్తలు (Latest News)
-
World News
Easter Attacks: ‘నన్ను క్షమించండి..’ శ్రీలంక మాజీ అధ్యక్షుడు సిరిసేన
-
India News
Khushbu Sundar: వీల్ఛైర్ కోసం 30 నిమిషాలా?.. ఎయిరిండియాపై ఖుష్బూ అసహనం
-
Sports News
PCB: మికీ ఆర్థర్ పాక్ ‘ఆన్లైన్ కోచ్’.. సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువ
-
Technology News
WhatsApp: వాట్సాప్ వీడియో.. ఈ మార్పు గమనించారా..?
-
Movies News
RRR: ఆస్కార్ బరిలో నిలిచిన చిత్రాలను వెనక్కి నెట్టి.. నంబరు 1గా ‘ఆర్ఆర్ఆర్’
-
Politics News
AAP: కర్ణాటకపై ఆప్ గురి: అజెండాపై కసరత్తు.. పార్టీల హామీలపై కౌంటర్!