
దైవాన్ని మోసగించలేం
యేసుప్రభువు ధర్మప్రచారం చేస్తున్న రోజుల్లో ‘నీతిమంతులుగా కనిపిస్తూ నిజాయితీ లేనివారు కపటులు పులిసినపిండితో సమానం. వారి తప్పుడు బోధలతో ప్రజలు దారితప్పే అవకాశం ఉంది. ఎందులోనూ ద్వైదీభావం తగదు. అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్లుండాలి. దైవజ్ఞానం పవిత్రమైంది. అక్కడ సమానత్వం, సత్ఫలితాలుంటాయి. పక్షపాతవైఖరి, పైపై డాంబికాలకు చోటుండదు. కానీ మనుషుల నడవడి స్వార్థంతో నిండి ఉంటుంది. దేవుని అనుగ్రహం కోరుకునేవారు కోపం, ద్వేషం, కపటం, అసూయలను వదిలి నిర్మల మనసుతో జీవించాలి. లోకంలో ఉన్న విషయాలపై వ్యామోహం పెంచుకుంటూ, ప్రార్థనలు చేయడాన్ని దేవుడు ఆమోదించడు. ఈ లోక ప్రలోభాలు దేవుడితో వైరమని తెలుసుకోవాలి. ఎవరినైనా మభ్యపెట్టగలం కానీ మన అంతరంగాన్నీ, దైవాన్నీ మోసగించలేం. అందుకే భక్తుడైన దావీదు ‘మా దోషాలన్నీ నీయెదుట ఉన్నాయి. నీ ముఖ కాంతిలో మేం చాటుగా చేసిన పాపాలు కనిపిస్తున్నాయి’ అన్నాడు. కనుక పరిశుద్ధ జీవితమే దేవునికి ప్రీతికరం’ అంటూ ప్రబోధించాడు.
- బందెల స్టెర్జి రాజన్
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Rishi Sunak: రిషి సునాక్ 100 రోజుల ప్రతిన..
-
Crime News
Andhra News: వాగులో దూకి నిందితుడి పరారీ.. పోలీసులు గాలించినా లభించని ఆచూకీ
-
Movies News
K.Viswanath: కళాతపస్వి కె.విశ్వనాథ్ కన్నుమూత
-
General News
Telangana News: కొత్త సచివాలయంలో అగ్నిప్రమాదం
-
World News
Saudi Arabia: ఈ యువరాజు హయాంలో.. రికార్డు స్థాయి మరణశిక్షలు..!
-
India News
Jammu Kashmir: కశ్మీర్ ఉగ్రవాదుల కొత్త ఆయుధం.. పెర్ఫ్యూమ్ బాంబ్!