
పంట రుణాలపై వడ్డీ రాయితీ కొనసాగించేందుకు కేంద్రం సమ్మతి
రూ.3 లక్షలకు మించని అప్పులకు వర్తింపు
ముంబయి: స్వల్పకాలిక పంట రుణాలకు వడ్డీ రాయితీని ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరానికి కొనసాగించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. వ్యవసాయం, దాని అనుబంధ కార్యకలాపాల కోసం కిసాన్ క్రెడిట్ కార్డు (కేసీసీ) ద్వారా రూ.3లక్షలకు మించకుండా బ్యాంకు రుణం తీసుకునే వారికి ఈ పథకం వర్తిస్తుంది. వీరికి 7శాతం వడ్డీకే రుణం లభిస్తుంది. బ్యాంకులకు సకాలంలో బకాయిలు తీర్చిన రైతులకు 3శాతం వడ్డీని కేంద్ర ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది. దీంతో 4శాతం వడ్డీకే పంట రుణం లభించినట్లవుతుంది. రైతులకు రుణాలిచ్చే ఆర్థిక సంస్థలకు అందజేసే నిధుల విషయంలో 1.5శాతం మేర వడ్డీ రాయితీ ఉంటుందని రిజర్వు బ్యాంకు ఓ సర్క్యులర్లో తెలిపింది. 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాలకు ఇది వర్తిస్తుంది.
మరిన్ని
Amit Shah: సీబీఐ, ఈడీ దుర్వినియోగం ఆరోపణలపై స్పందించిన అమిత్ షా
Divorce: భార్యకు హెచ్ఐవీ అంటూ విడాకులకు దరఖాస్తు.. బాంబే హైకోర్టు ఏమన్నదంటే!
Morbi Bridge Collapse: ఆ పరిహారం సరిపోదు.. మోర్బీ ఘటనపై గుజరాత్ హైకోర్టు వ్యాఖ్యలు!
Sharad Pawar: గవర్నర్ తన హద్దులన్నీ దాటారు.. శరద్ పవార్ విమర్శలు
Richa Chadha: గల్వాన్ ప్రస్తావన.. నటి పోస్ట్పై నెట్టింట దుమారం!


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (31/01/2023)
-
World News
Meta: మేనేజర్ వ్యవస్థపై జూకర్బర్గ్ అసంతృప్తి.. మరిన్ని లేఆఫ్లకు సంకేతాలు..?
-
India News
Noida: పాత కార్లపై నజర్.. ఫిబ్రవరి 1 నుంచి 1.19లక్షల కార్లు సీజ్
-
Movies News
Pathaan: పఠాన్కు వెన్నెముక ఆయనే: షారుక్ ఖాన్
-
General News
Bengaluru: బెంగళూరుకు గులాబీ శోభ.. నగరంలో కొత్త అందాల ఫొటోలు చూశారా?
-
World News
Viral News: ఒక్కో ఉద్యోగికి ₹6 కోట్లు బోనస్.. కట్టలుకట్టలుగా పంచిన చైనా కంపెనీ!