
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
1. రావణ దహనంలో మారణహోమమే లక్ష్యం?
2005 అక్టోబరు 12, బుధవారం, విజయదశమి. సికింద్రాబాద్ టాస్క్ఫోర్స్ కార్యాలయంపై బంగ్లాదేశ్కు చెందిన డాలిన్ ఆత్మాహుతి దాడి. ఆ సమయంలో పోలీసులు ఎవరూ లేకపోవటంతో పెను ప్రమాదం తప్పింది. విధుల్లో ఉన్న హోంగార్డు సహా డాలిన్ మరణించాడు. ఈ దాడికి పథకం పాకిస్తాన్ నుంచే జరిగింది. డాలిన్కు సాయం చేసిన వారి జాబితాలో మూసారాంబాగ్కు చెందిన అబ్దుల్ జాహెద్ అరెస్టయ్యాడు. 2022 అక్టోబరు 5, బుధవారం, విజయదశమి. భారీగా ప్రాణనష్టం లక్ష్యం. ఇదే పట్టుబడిన ముగ్గురు ఉగ్రమూకల పథకం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. ఎనిమిదో తరగతి విద్యార్థులకు లక్ష స్కాలర్షిప్పులు
మీరు ఎనిమిదో తరగతి విద్యార్థులా? ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారా? అయితే మీ కోసం లక్ష స్కాలర్షిప్పులు సిద్ధంగా ఉన్నాయి. ఎంపికైనవారికి తొమ్మిది నుంచి ఇంటర్ వరకు వరుసగా నాలుగేళ్లపాటు ప్రతి నెలా రూ.వెయ్యి చొప్పున అందిస్తారు. పరీక్షలో చూపిన ప్రతిభతో ఈ ప్రోత్సాహాలు సొంతమవుతాయి. ప్రకటన వెలువడిన నేపథ్యంలో నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్పులు 2022-23 పూర్తి వివరాలు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. దసపల్లా భూములు ప్రభుత్వానివే
దసపల్లా భూములు కచ్చితంగా ప్రభుత్వానివేనని విశ్రాంత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు స్పష్టంచేశారు. వాటిని దక్కించుకునేందుకు ఎప్పట్నుంచో ప్రయత్నిస్తుండగా, ఈ నాటికి నెరవేరుతున్నాయన్నారు. ‘ఇప్పటికైనా మించిపోలేదు. ఈ భూములకు సంబంధించిన దస్త్రాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి, మోసం ఎక్కడ జరిగిందో తెలుసుకుని న్యాయస్థానంలో నిరూపించగలిగితే ప్రభుత్వానికే విజయం లభిస్తుంది’ అని సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. ఆ కళాశాలల్లో ఫీజులు పెరుగుతాయ్!
తెలంగాణ ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) గత నెలలో ఖరారు చేసిన బీటెక్ ఫీజులను అంగీకరించని కళాశాలల్లో రుసుములు మారనున్నాయి. విచారణకు హాజరై అభ్యంతరాలను వ్యక్తంచేసి, అవసరమైన ఆధారాలను చూపిన కళాశాలల ఫీజుల మొత్తం కొంత పెరగనుంది. ఫలితంగా కొద్ది నెలలుగా సాగుతున్న ఫీజుల వ్యవహారం కొలిక్కి వచ్చినట్లయింది. గత నెల 24న రెండోసారి విచారణ జరిపిన టీఏఎఫ్ఆర్సీ ఫీజులను ఖరారు చేసింది. రాష్ట్రంలోని 173 ఇంజినీరింగ్ కళాశాలల్లో 20 ఈ మొత్తాలను అంగీకరించలేదు. అందులో సీబీఐటీ, నారాయణమ్మ.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. దసరా, ఆ తర్వాతి రోజు భారీ వర్షాలు
బంగాళాఖాతం పశ్చిమ మధ్య ప్రాంతంపై అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా సముద్రమట్టం నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు గాలులతో ఉపరితల ఆవర్తనం విస్తరించింది. ఈ అల్పపీడనం దసరా (బుధవారం) నాటికి ఏపీ తీరం వైపు వచ్చే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మంగళవారం ఓ మోస్తరుగా.. బుధ, గురువారాల్లో భారీవర్షాలు కురిసే అవకాశాలున్నాయని వివరించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. రైట్ చెప్పాలంటే గుంత పూడ్చాల్సిందే!
ఆ రోడ్డులో పలుచోట్ల పెద్ద పెద్ద గోతులున్నాయి. అప్రమత్తంగా లేకుంటే ఒళ్లు హూనం కావడంతోపాటు వాహన చక్రాలు ఎక్కడ ఊడిపోతాయో తెలియని పరిస్థితి. దీంతో ప్రజా రవాణా శాఖ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం డిపో డ్రైవరు బి.ఎ.నాయుడు, కండక్టరు ఆర్.ఎస్. ప్రసాద్ బండరాళ్లను బస్సులో తీసుకువచ్చి గోతుల్లో వేసి రాకపోకలకు ఇబ్బందుల్లేకుండా చర్యలు చేపట్టారు. నర్సీపట్నం - తాండవ మార్గంలో ఈ ఘటన జరిగింది. బస్సు డ్రైవరు, కండక్టర్ రాళ్లను గోతుల్లో వేయడాన్ని ఓ ప్రయాణికుడు వీడియో తీసి సోమవారం సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. ఈ శునకం.. ఖరీదులో ‘కనకం’..
దసరా వేడుకల్లో భాగంగా కర్ణాటకలోని శివమొగ్గలో ఆదివారం రాష్ట్ర స్థాయి పెంపుడు జంతువుల ప్రదర్శన జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి 100 మందికి పైగా ప్రతినిధులు పోటీల్లో పాల్గొన్నారు. 22 జాతుల శునకాలతో వాటి యజమానులు వచ్చారు. బెంగళూరుకు చెందిన వ్యాపారి, జాగిలాల ప్రియుడు ‘కడబం’ సతీశ్ తీసుకొచ్చిన టిబెటియన్ మస్టిఫ్ జాతి జాగిలం ‘భీమ’ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రూ.10 కోట్లు ఖర్చు చేసి, గత ఏడాది చైనాలోని బీజింగ్ నుంచి ప్రత్యేక విమానంలో భీమను తెప్పించినట్లు ఆయన చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. ‘గాడ్ ఫాదర్’లో పది సర్ప్రైజ్లు!
‘హనుమాన్ జంక్షన్’ చిత్రంతో సినీప్రియుల్ని కడుపుబ్బా నవ్వించారు దర్శకుడు మోహన్రాజా. 21 ఏళ్ల విరామం తర్వాత ‘గాడ్ఫాదర్’తో తిరిగి తెలుగు ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమయ్యారు. చిరంజీవి కథానాయకుడిగా నటించిన చిత్రమిది. మలయాళంలో విజయవంతమైన ‘లూసీఫర్’కు ఇది రీమేక్. సల్మాన్ఖాన్, నయనతార, సత్యదేవ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. బుధవారం విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం హైదరాబాద్లో విలేకర్లతో ముచ్చటించారు మోహన్రాజా. ఆ విశేషాలివి.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. పల్లె గళం.. పార్లమెంటులో!
నలుగురిలో మాట్లాడాలంటేనే చాలా మందికి బిడియం. అలాంటిది డిగ్రీ అమ్మాయి.. దేశ పార్లమెంట్లో ప్రసంగించడమంటే మాటలా! మిద్దె రూప ఆ అవకాశాన్ని దక్కించుకుంది. ఆ అవకాశం ఎలా వచ్చింది.. అక్కడేం మాట్లాడిందన్న అంశాల్ని వసుంధరతో పంచుకుందిలా.. నేను ఎనిమిదో తరగతిలో ఉండగా.. ‘అమ్మాయిలైతేనేం.. వాళ్లూ బాగా చదువుకుని పేరు తెస్తారు’ అని బంధువులతో నాన్న చెప్పడం విన్నా. అప్పటివరకూ నాకెలాంటి లక్ష్యాల్లేవ్. నాన్న మాటలు విన్నాక నాలో మార్పు వచ్చింది. మాది వైఎస్సార్ కడప జిల్లా టి.కోడూరు. నాన్న సత్యనారాయణ, అమ్మ రమాదేవి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. వాట్సప్లో మెట్రోరైల్ టిక్కెట్లు
మెట్రోరైల్ ప్రయాణికులు ఇకపై వాట్సప్ ద్వారా టిక్కెట్లు కొనుగోలు చేయవచ్చని అధికారులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మెట్రోరైల్ కౌంటర్లలో టిక్కెట్లు కొనేందుకు వరుసలో నిల్చోవాల్సిన అవసరం లేదని వివరించారు. వాట్సప్ ద్వారా డిజిటల్ పద్ధతిలో నగదు బదిలీ చేయవచ్చని, దేశంలోనే తొలిసారిగా తాము ప్రయాణికుల సౌకర్యార్థం ఈ కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఇందుకోసం బిల్ఈజీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
మరిన్ని
Vande Bharat: ‘వందే భారత్’ టాప్ స్పీడ్ ఇక 200 kmph: అశ్వినీ వైష్ణవ్
IND vs SA: సఫారీలదే ఆఖరి పంచ్.. సిరీస్ మాత్రం టీమ్ఇండియాదే
EC: ఎన్నికల హమీలను ఎలా నెరవేరుస్తారు..? మీకున్న వనరులేంటి..?
Harshal Patel: హర్షల్.. స్లో బంతులను అలా వేయొద్దు: సంజయ్ బంగర్
CM Kcr: జాతీయ పార్టీ సిద్ధం.. హైదరాబాద్ చేరుకుంటున్న వివిధ రాష్ట్రాల నేతలు
Jio laptop: జియో ల్యాప్టాప్ వచ్చేసింది.. కేవలం వారికి మాత్రమే!
jasprit bumrah: బుమ్రా.. అంతే బలంగా తిరిగిరావాలి: క్రికెటర్ల భావోద్వేగం
Hyderabad: ఖైరతాబాద్లో కానిస్టేబుల్ వీరంగం.. మద్యం మత్తులో యువకులపై దాడి
Missile Fire: ఉత్తర కొరియా దూకుడు.. జపాన్ మీదుగా క్షిపణి ప్రయోగం!
Jio 5g: రేపటి నుంచే ఆ నగరాల్లో 5జీ బీటా సేవలు.. రిలయన్స్ జియో ప్రకటన
Hyderabad: బైక్పై వెళ్లి 4 గ్రనేడ్లు తెచ్చిన జాహెద్.. రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెల్లడి
Pakistan: నీళ్లకు బదులు యాసిడ్.. రెస్టారంట్ మేనేజర్ అరెస్ట్!
Uttarakhand: మంచుకొండల్లో విషాదం.. 10 మంది పర్వతారోహకులు మృతి
RK Roja: 3 రాజధానులకు మద్దతుగా ఆలయాల్లో పూజలు చేయండి: మంత్రి రోజా
INDw Vs UAEw: అమ్మాయిలూ భళా.. ఆసియా కప్లో భారత్ హ్యాట్రిక్ విజయం
Hero vida: మార్కెట్లోకి త్వరలో హీరో విడా ఎంట్రీ.. ఛార్జింగ్ కష్టాలకు చెక్..?
Andhra News: అమరావతి రైతులకు ఏదైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత: కనకమేడల
Stock Market: భారీగా పుంజుకున్న మార్కెట్లు.. 58,000 ఎగువకు సెన్సెక్స్!
Uttarakhand: ఉత్తరాఖండ్లో హిమపాతం.. చిక్కుకుపోయిన 29 మంది పర్వతారోహకులు!
Automobile retail sales: సెప్టెంబరు వాహన రిటైల్ విక్రయాల్లో 11% వృద్ధి
Adipurush: ‘ఆదిపురుష్’ డైరెక్టర్కు మధ్యప్రదేశ్ హోంమంత్రి వార్నింగ్!
Ukraine Crisis: బెడిసికొట్టిన మస్క్ ‘శాంతి ప్రణాళిక’.. కుబేరుడిపై జెలెన్స్కీ కౌంటర్ ఓటింగ్..!
Ukraine war: యుద్ధం పేరుతో ఎవర్నీ చంపలేను.. సైన్యంలో చేరలేక రష్యన్ ర్యాపర్ ఆత్మహత్య..!
ఎలక్ట్రానిక్స్ తయారీకి జాయింట్ వెంచర్.. రిలయన్స్-సన్మినా డీల్ పూర్తి
GodFather: పారితోషికం గురించి నయన్ ఒక్క మాటా మాట్లాడలేదు : ఎన్వీ ప్రసాద్
5G SmartPhone: 5జీ ఫోన్ కొంటున్నారా..? ఈ మూడు విషయాలు గుర్తుంచుకోండి!
IND VS SA : నేడు ఆఖరి మ్యాచ్.. శ్రేయస్, సిరాజ్లకు చోటు కల్పిస్తారా..?
Indrakeeladri: మహిషాసురమర్దని అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గమ్మ
Kia Carens: 44 వేల కియా కరెన్స్ కార్ల రీకాల్.. ఎందుకో తెలుసా?
Jairam Ramesh: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేకహోదా: జైరాం రమేశ్
Jammu And Kashmir: డీజీ హత్య కేసు.. ఇంటి సహాయకుడి డైరీలో ఏముందంటే..?
Trump: సీఎన్ఎన్పై ట్రంప్ ₹3,867 కోట్ల పరువునష్టం దావా.. ఎందుకంటే?
WhatsApp: ఒకేసారి 32 మందికి వీడియోకాల్.. డీఎన్డీ మోడ్, డాక్యుమెంట్ క్యాప్షన్.. ఇంకా!
Adipurush: ఆదిపురుష్ టీజర్.. సినిమాతో మాకెలాంటి సంబంధం లేదు
Electronics Mart IPO: ప్రారంభమైన బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఐపీఓ.. పూర్తి వివరాలివిగో!
Shoaib Akhtar: పాక్ తొలి రౌండ్లోనే పోతుందేమో..: షోయబ్ అక్తర్
Stock Market: మార్కెట్లలో ‘బ్రిటన్ ట్యాక్స్’ జోష్.. సెన్సెక్స్కు 1000 పాయింట్ల లాభం
Costliest Dog: ఈ శునకం.. ఖరీదులో ‘కనకం’.. ధర తెలిస్తే అవాక్కవుతారు!
Hyderabad Metro: వాట్సప్లో మెట్రోరైల్ టిక్కెట్లు..ఎలా పొందాలంటే..
Vizag: మద్యం మత్తులో దాడి.. పిడిగుద్దులకు ప్రాణాలు కోల్పోయిన వృద్ధుడు
TSRTC: ఇక ఆర్టీసీ బ్రాండ్ తాగునీరు.. మార్కెట్లోనూ విక్రయాలకు యోచన!
దుర్గమ్మ తెచ్చే కాసుల పంట.. పశ్చిమబెంగాల్లో దసరా వ్యాపారం ఎంతో తెలుసా?
ప్రేమ పేరుతో వలవేసి అత్యాచారం.. వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేసి..
Rohit Sharma: డెత్ ఓవర్ల బౌలింగ్.. ఆ అవసరం కచ్చితంగా ఉందన్న రోహిత్
Shashi Tharoor: రేవంత్ పిలిస్తే గాంధీభవన్కు వెళ్లి ప్రచారం చేసుకుంటా: శశిథరూర్
Iran: ఆ రెండు దేశాల కుట్ర వల్లే అల్లర్లు.. ఇరాన్ సుప్రీం లీడర్
Mulayam: ములాయం కోసం ప్రత్యేక పూజలు.. అవసరమైతే కిడ్నీ ఇస్తానంటూ ఓ నేత ప్రకటన!
Virat Kohli : మరో పరుగు చేస్తే హాఫ్ సెంచరీ.. డీకేతో కోహ్లీ ఏమన్నాడంటే..
Social Look: డ్యాన్స్తో అలరించిన అనసూయ.. సాగర తీరాన ప్రియా ప్రకాశ్!
Balasubrahmanyam: గుంటూరులో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం తొలగింపు
Revanth Reddy: జోడో యాత్రకు భయపడే.. ఈ కుట్రలు కుతంత్రాలు: రేవంత్
Kabul: క్లాస్రూమ్లో ఆత్మాహుతి దాడి ఘటనలో 46మంది బాలికలు మృతి
Ind vs SA: సఫారీలపై విజయం.. గెలుపోటములపై కెప్టెన్ల స్పందన ఇదీ!
Rashmika: ఉలిక్కిపడి లేచేదాన్ని..రాత్రంతా ఏడ్చేదాన్ని..: రష్మిక
ఖర్గే Vs థరూర్: ఆఫీస్ బేరర్లు ఎన్నికల ప్రచారం చేయొద్దు.. కాంగ్రెస్
Hyderabad: అంబులెన్స్ నడిపిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. వీడియో
బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ యూటర్న్.. సంపన్నులకు పన్ను కోతపై వెనక్కి!
Railways: 200 రైల్వేస్టేషన్లలో ఆధునిక సౌకర్యాలు పునరుద్ధరణ: వైష్ణవ్
Oke Oka Jeevitham: శర్వానంద్ ‘ఒకే ఒక జీవితం’ ఆ ఓటీటీలోకే.. కానీ
Rahul: కర్ణాటక ప్రభుత్వం దేశంలోనే అత్యంత అవినీతిమయం: రాహుల్ ఫైర్


తాజా వార్తలు (Latest News)
-
India News
Child Marriages: అరెస్టులకు సిద్ధం.. 4000 మందిపై కొనసాగుతున్న విచారణ
-
Sports News
IND vs PAK: పాక్ ఆటగాళ్లను భారత అభిమానులు ఎంతో గౌరవిస్తారు: ఉమర్ అక్మల్
-
India News
PM-KUSUM: ‘పీఎం కుసుమ్’ పథకం 2026 వరకు పొడిగింపు
-
Politics News
Arvind Kejriwal: రాజకీయాల్లో ‘ఆమ్ఆద్మీ’ సక్సెస్.. ఎందుకంటే..!
-
Sports News
IPL 2023: అప్పటికల్లా.. ఫుట్బాల్ లీగ్ కంటే అతిపెద్ద ఈవెంట్ ఐపీఎల్ అవుతుంది: స్ట్రాస్
-
World News
Hong Kong: 5 లక్షల విమాన టికెట్లు ఫ్రీ.. పర్యాటకులకు హాంకాంగ్ ఆఫర్!