
కొలకలూరి ఇనాక్కు మహామహోపాధ్యాయ అవార్డు ప్రదానం
వకుళాభరణం కృష్ణమోహన్కు ‘బీసీ యోధ’ పురస్కారం
ద్రాక్షారామ, న్యూస్టుడే: ఒక వ్యక్తి జీవితంలో ఎన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించినా.. విద్య నేర్పిన ఉపాధ్యాయుడికి శిష్యుడేనని మంత్రి వేణుగోపాలకృష్ణ అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ఎ.అగ్రహారం రాజారత్న కిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో ఆదివారం నిర్వహించిన ‘ఐడియల్ టీచింగ్ అవార్డు 2022’ కార్యక్రమంలో మంత్రి వేణుగోపాలకృష్ణ, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్చంద్రబోస్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మహామహోపాధ్యాయ అవార్డును రచయిత, కవి, సాహితీవేత్త కొలకలూరి ఇనాక్కు, విద్యా రంగంలో విశేష కృషి చేసిన 150 మందికి ఐటాప్-2022 అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ ఒక ఇంజినీరు తప్పు చేస్తే భవనం మాత్రమే కూలిపోతుందని, ఉపాధ్యాయుడు తప్పుచేస్తే సమాజమే నాశనమవుతుందన్నారు. ఎంపీ పిల్లి సుభాష్చంద్రబోస్ మాట్లాడుతూ పేదరికాన్ని జయించడానికి విద్య ఒక్కటే ఆయుధమన్నారు. తెలంగాణ బీసీ కమిషన్ ఛైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్కు బీసీ యోధ పురస్కారాన్ని ప్రదానం చేశారు. సీబీఐ మాజీ జేడీ వి.వి.లక్ష్మీనారాయణ చేతులమీదుగా అవార్డు అందజేశారు. విద్యా సంస్థల ఛైర్మన్ డా.ఆర్.బి.అంకం పాల్గొన్నారు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Social Look: ‘ఫర్జీ’ కోసం రాశీఖన్నా వెయిటింగ్.. శివాత్మిక లవ్ సింబల్!
-
Sports News
Team India: భారత క్రికెట్ భవిష్యత్ సూపర్ స్టార్లు వారే: కుంబ్లే
-
Sports News
SKY: క్లిష్ట పరిస్థితుల్లోనూ.. ప్రశాంతంగా ఉండటం అలా వచ్చిందే..: సూర్యకుమార్
-
Politics News
KTR: పీఎం కేర్స్పై కేంద్రం వివరణ.. అసహనం వ్యక్తం చేసిన కేటీఆర్
-
Sports News
IND vs NZ: ఉమ్రాన్ ఇంకా నేర్చుకోవాలి.. మణికట్టు మాంత్రికుడు ఉండాల్సిందే: వసీమ్ జాఫర్
-
India News
Budget 2023: ఎన్నికల ఎఫెక్ట్.. బడ్జెట్లో కర్ణాటకకు ‘ప్రత్యేక’ కేటాయింపులు