
Chittoor: రూ.కోటి వరించినా.. విధి వంచించింది
చిన్నారికి ప్రాణాంతక వ్యాధి
రూ.కోటి సాయం ప్రకటించిన విద్యాసంస్థ
చికిత్సకు వెళుతూ తల్లిదండ్రుల మృత్యువాత
బెంగళూరు (గ్రామీణం), పాలసముద్రం (చిత్తూరు), న్యూస్టుడే: వారిది నిరుపేద కుటుంబం. ఇద్దరు కుమారులతో సంతోషంగా జీవిస్తున్నారు. అంతలోనే చిన్న కుమారుడికి ప్రాణాంతక వ్యాధి సోకడంతో వారి కాళ్లకింద భూమి కంపించింది. వీరి గుండెకోతను అర్థం చేసుకున్న దాతలు ఏకంగా రూ.కోటి సాయం చేస్తామన్నారు. బిడ్డను బతికించుకుంటామనే ఆశ చిగురించింది. అంతలోనే అనూహ్య ప్రమాదం వారిద్దరినీ కబళించింది. చిన్నారి తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యాడు. ఇవీ వివరాలు... తమిళనాడు రాష్ట్రం రాణిపేట జిల్లా కళ్లిపట్టుకు చెందిన బాలమురుగన్(45), సెల్వి(36) దంపతులకు ఇద్దరు కుమారులు. వీరి కుటుంబం కూలీ చేసుకుంటూ చాన్నాళ్లుగా బెంగళూరులోనే ఉంటోంది. నాలుగేళ్ల చిన్న కుమారుడికి(పేరు తెలియరాలేదు) ప్రాణాంతక వ్యాధిని గుర్తించారు. చికిత్సకు బెంగళూరులోని ఓ సంస్థ రూ.కోటి ఆర్థిక సాయం ప్రకటించింది. ఆ సొమ్ముతో చికిత్స చేయించేందుకు ఆ కుటుంబం సిద్ధమైంది. పెద్దబాబును బెంగళూరు కత్రిగుప్పెలోని తాత వద్ద ఉంచి, శుక్రవారం తమిళనాడులోని స్వగ్రామానికి వచ్చారు. కొంత డబ్బును సమకూర్చుకున్నాక కళ్ల్లిపట్టు నుంచి బంధువులున్న చిత్తూరు జిల్లా బలిజకండ్రిగ చేరుకుని.. ఆదివారం రాత్రి 9.30 గంటలకు కేఎస్ఆర్టీసీ బస్సులో బెంగళూరుకు ప్రయాణమయ్యారు. హొసకోటె మైలాపుర గేటు వద్ద అర్ధరాత్రి వేళ రోడ్డు పక్కన రాళ్ల లోడుతో నిలిపి ఉంచిన లారీని ఆ బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో బాలమురుగన్, సెల్వి మాంసం ముద్దలుగా మారారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడగా బెంగళూరు మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. వారిలో బాలమురుగన్ కుమారుడు కూడా ఉన్నాడు. అసలే ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారి తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చేరాడు. ప్రమాదానికి డ్రైవరు నిర్లక్ష్యమే కారణమని, పరారీలో ఉన్నాడని బెంగళూరు గ్రామీణ జిల్లా ఎస్పీ మలికార్జున బాలదండి తెలిపారు. ఘటనలో చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలవాసులు పలువురికి గాయాలయ్యాయి. సోమవారం రాత్రి ఎనిమిది గంటలకు మృతదేహాలు కళ్లిపట్టుకు చేరుకోవడంతో ఆంధ్రప్రదేశ్-తమిళనాడు సరిహద్దులోని ఆ గ్రామంలో విషాదం నెలకొంది.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Viral news: విలేకరిపై అమానుషం.. చెట్టుకు కట్టి.. చితకబాది..!
-
General News
KTR : హిండెన్బర్గ్ నివేదికపై కేంద్రానికి మంత్రి కేటీఆర్ ప్రశ్నలు
-
India News
Child Marriage: మైనర్ బాలికతో వివాహం.. యావజ్జీవ కారాగార శిక్షే..!
-
Politics News
Tripira Election: త్రిపుర బరిలో కేంద్రమంత్రి.. భాజపా జాబితా విడుదల
-
Movies News
Pathaan: రోజుకు రూ. వంద కోట్లు.. ‘పఠాన్’ ఖాతాలో మరో రికార్డు
-
Sports News
IPL 2023: ఐపీఎల్ ఆల్టైమ్ ‘XI’.. కెప్టెన్సీపై చర్చ.. ఓజా ఎంపిక ఎవరంటే?