
వచ్చే వారం నుంచి సుప్రీంకోర్టులో నాలుగు ప్రత్యేక ధర్మాసనాలు
సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ వెల్లడి
ఈనాడు, దిల్లీ: అత్యధిక కేసులు ఉన్న నాలుగు అంశాల వేగవంత విచారణ కోసం వచ్చే వారం నుంచి సుప్రీంకోర్టులో నాలుగు ప్రత్యేక ధర్మాసనాలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ బుధవారం ప్రకటించారు. ఈ ధర్మాసనాలు.. 1. క్రిమినల్ అప్పీళ్లు, 2. భూసేకరణ అంశాలు, 3. వాహన ప్రమాద క్లెయిమ్స్ ట్రైబ్యునల్ కేసులు, 4.ప్రత్యక్ష, పరోక్ష పన్నుల కేసులను విచారించనున్నట్లు సీజేఐ వెల్లడించారు. భూసేకరణ అంశాలకు సంబంధించిన ధర్మాసనానికి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వం వహించనున్నట్లు తెలిపారు. ధర్మాసనాల్లో సభ్యులుగా ఎవరెవరు ఉంటారన్నది తెలియాల్సి ఉంది. ఓ కేసుకు సంబంధించి అత్యవసరంగా విచారణ చేపట్టాలని ఓ న్యాయవాది చేసిన అభ్యర్థనకు సీజేఐ స్పందిస్తూ ఈ ధర్మాసనాల ఏర్పాటు గురించి వెల్లడించారు.
28 నుంచి ప్రతి బెంచ్ ముందు పదేసి ట్రాన్స్ఫర్, బెయిల్ పిటిషన్లు
ఈ నెల 28 నుంచి సుప్రీంకోర్టులోని అన్ని ధర్మాసనాల ముందూ ప్రతిరోజూ 10 ట్రాన్స్ఫర్ పిటిషన్లు (నోటీసులు జారీ చేసినవి), 10 బెయిల్ పిటిషన్ల విచారణ చేపట్టనున్నారు. తొలుత ఈ 20 కేసులను విచారించిన తర్వాతే ధర్మాసనాలు మిగతా కేసులకు వెళ్లనున్నాయి. అలాగే ప్రతి మంగళ, బుధ, గురువారాల్లో 7 కొత్త కేసులనూ లిస్ట్ చేస్తారు. తుది దశకు వచ్చిన కేసుల విచారణ బుధ, గురువారాల్లో జరుగుతుంది. మంగళవారం ఇలాంటి కేసులను లిస్ట్ చేయరు. కొత్తగా ఏదైనా ఎస్ఎల్పీ దాఖలు చేసినప్పుడు అందులోని లోపాలను సుప్రీంకోర్టు రిజిస్ట్రీ చెప్పిన 28 రోజుల్లోపు సరిదిద్ది దాఖలు చేయాల్సి ఉంటుంది.
మరిన్ని
Amit Shah: సీబీఐ, ఈడీ దుర్వినియోగం ఆరోపణలపై స్పందించిన అమిత్ షా
Divorce: భార్యకు హెచ్ఐవీ అంటూ విడాకులకు దరఖాస్తు.. బాంబే హైకోర్టు ఏమన్నదంటే!
Morbi Bridge Collapse: ఆ పరిహారం సరిపోదు.. మోర్బీ ఘటనపై గుజరాత్ హైకోర్టు వ్యాఖ్యలు!
Sharad Pawar: గవర్నర్ తన హద్దులన్నీ దాటారు.. శరద్ పవార్ విమర్శలు
Richa Chadha: గల్వాన్ ప్రస్తావన.. నటి పోస్ట్పై నెట్టింట దుమారం!


తాజా వార్తలు (Latest News)
-
Politics News
TS Assembly: బడ్జెట్ సమావేశాలపై బీఏసీలో చర్చ.. 25 రోజుల పాటు నిర్వహించాలన్న భట్టి
-
Latestnews News
Team India: టీ20 ప్రపంచకప్ 2007 ఫైనల్ ‘ఓవర్’ హీరో.. క్రికెట్కు వీడ్కోలు
-
Movies News
K Viswanath: విశ్వనాథ్ ‘S’ సెంటిమెంట్.. ఆ రెండు చిత్రాల విషయంలో నెరవేరని కల!
-
General News
Krishna Tribunal: కొత్త కృష్ణా ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలా? వద్దా?.. అభిప్రాయం వెల్లడించని ఏజీ
-
India News
Parliament: అదానీ ఎఫెక్ట్.. సోమవారానికి వాయిదా పడిన ఉభయ సభలు
-
World News
Putin: 80 ఏళ్ల తర్వాత.. మళ్లీ సరిహద్దుల్లో వారి ట్యాంకులు..!