
జాతీయ- అంతర్జాతీయ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తూ ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దాఖలు చేసిన పలు కేసులను సుప్రీం కోర్టు సోమవారం లాంఛనప్రాయంగా కొట్టివేసింది. ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ గెల్చుకున్న అరిజోనా, జార్జియా, మిషిగన్, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్ రాష్ట్రాల్లో ట్రంప్, ఆయన మద్దతుదారులు దాఖలు చేసిన దావాలు ఇందులో ఉన్నాయి. పెన్సిల్వేనియా ఫలితాల విషయంలో దాఖలైన దావాలను విచారణకు స్వీకరించడంపై న్యాయమూర్తుల్లో భిన్నాభిప్రాయాల్లో వ్యక్తమయ్యాయి. అయితే- మెజారిటీ నిర్ణయం ప్రాతిపదికన వాటిని కూడా తిరస్కరించారు.