
బిజినెస్
ఆల్ఇండియా ట్రాన్స్పోర్ట్ వేల్ఫేర్ అసోసియేషన్
ఇంటర్నెట్డెస్క్: అసలే ఇంధన ధరలు మండిపోతుండటంతో అవస్థలు పడుతున్న సామాన్యూడిపై మరోపిడుగు పడే ప్రమాదం ఉంది. పెరుగుతున్న డీజిల్ ధరల కారణంగా రవాణా ఛార్జీలు 25శాతం వరకు పెరగవచ్చని ఆల్ఇండియా ట్రాన్స్పోర్టు వెల్ఫేర్ అసోసియేషన్ ఛైర్మన్ ప్రదీప్ సింఘాల్ పేర్కొన్నారు. ‘‘గతేడాది నుంచి డీజిల్ ధరలు దాదాపు 35శాతం వరకు పెరిగాయి. దీంతో ఫుల్ ట్రక్లోడ్ డీల్స్ రవాణా ఛార్జీలు 25-30శాతం వరకు పెరిగేందుకు కారణం కావచ్చు. సాధారణంగా ఇటువంటి డీల్స్ పెద్ద కంపెనీల మధ్య జరుగుతాయి. సాధారణంగా వార్షిక, అర్థ సంవత్సరానికి కంపెనీలతో ముందే ఒప్పందాలు అవుతాయి. ఇప్పటికే నెలకొన్న తీవ్రమైన పోటీ కారణంగా మధ్యలో రేట్లు పెంచడానికి సాధ్యపడదు. ఆ భారాన్ని మేమే భరించాలి. అవి రవాణ సంస్థల లాభదాయకతపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. మా మూలధన వ్యయాలు పెరుగుతాయి. అందుకే డీజిల్ ధరలను తగ్గించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. దేశ వ్యాప్తంగా చమురు ధరలు ఒకేలా ఉండాలి. అప్పుడే అన్ని ప్రదేశాలకు మా ట్రక్కులను పంపిస్తాము. నెలకోసారి మాత్రమే ఇంధన ధరల్లో మార్పులు ఉండాలి ’’ అని ఆయన వివరించారు.
ధరల్లో 16సార్లు మార్పులు జరగడంతో పెట్రోల్ ధర రూ.90 దాటగా .. డీజిల్ ధర రూ.88దాటేసింది. ఈ ప్రభావంతో ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. మరోపక్క రవాణ ఛార్జీల ధరలు పెరిగితే అన్ని వస్తువుల రేట్లు కూడా పెరిగే అవకాశం ఉంది.
ఇవీ చదవండి