బ్రేకింగ్

breaking
15 Jan 2022 | 10:05 IST

చుట్టేస్తోన్న కరోనా.. కొత్తగా 2.68లక్షల కేసులు

దిల్లీ: దేశంలో కరోనా మూడో దశ తీవ్రత పెరుగుతోంది. కొత్తగా 2,68,833 మంది మహమ్మారి బారిన పడ్డారు. కేసులు పెరుగుతుండటంతో రోజువారీ పాజిటివిటీ రేటు 16.66 శాతానికి ఎగబాకింది. అనారోగ్యం తీవ్రమవడంతో మరో 402 మంది మృతి చెందారు. మొత్తం కేసులు 3,68,50,962కి, మరణాలు 4,85,752కు చేరినట్టు కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం 14,17,820 మంది ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నట్టు తెలిపింది. మరోవైపు ఒమిక్రాన్‌ కేసులు కూడా పెరుగుతున్నాయి. ఒక్క రోజులో 288 కేసులు వెలుగు చూశాయి. దీంతో వీటి మొత్తం సంఖ్య 6,041కి చేరింది. దేశంలో ఇప్పటివరకు 156.02 కోట్ల టీకా డోసులు పంపిణీ చేశారు.

మరిన్ని

తాజా వార్తలు