బ్రేకింగ్

breaking
22 Jan 2022 | 19:16 IST

TS: ఈనెల 24 నుంచి ఆన్‌లైన్‌ తరగతులు

హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 24 నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. 8, 9, 10 తరగతులకు ఆన్‌లైన్‌ బోధన ద్వారానే విద్యను అందించాలని సూచించింది. ఈమేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు పాఠశాలలకు హాజరయ్యే ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బంది సైతం రోటేషన్‌ పద్ధతిలో 50 శాతం మంది మాత్రమే విధులకు హాజరుకావాలని పేర్కొంది.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని