బ్రేకింగ్

breaking
23 Jan 2022 | 14:27 IST

కొన్ని చోట్ల ఒమిక్రాన్‌ సబ్‌వేరియంట్‌: కేంద్రం

దిల్లీ: భారత్‌లో సామాజిక వ్యాప్తి దశలో ‘ఒమిక్రాన్‌’ కొనసాగుతోందని కేంద్రం వెల్లడించింది. మెట్రో నగరాల్లో ఒమిక్రాన్‌ విస్తృతంగా వ్యాప్తి చెందుతుందని తెలిపింది. కొన్ని చోట్ల ఒమిక్రాన్‌ సబ్‌వేరియంట్‌ BA.2 వంశక్రమం గుర్తించినట్లు కేంద్రం వెల్లడించింది. కొత్త కేసుల్లో ఎక్కువగా ఒమిక్రాన్‌ వేరియంట్‌వే ఉన్నాయని.. చాలావరకు నమోదైన కేసుల్లో స్వల్ప స్థాయిలో లక్షణాలు ఉంటున్నాయని కేంద్రం స్పష్టం చేసింది. అయితే, థర్డ్‌వేవ్‌లోనూ ఆసుపత్రిలో చేరికలూ, ఐసీయూ కేసులు పెరిగినట్లు తెలిపింది. కొవిడ్‌ రాకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని, టీకాలు తప్పనిసరిగా వేసుకోవాలని కేంద్రం సూచించింది.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని