బ్రేకింగ్

breaking
25 Jan 2022 | 12:53 IST

AP PRC: జీవోలు రద్దు చేసేవరకు చర్చల్లేవ్‌..

అమరావతి: ప్రభుత్వంతో చర్చలకు వెళ్లాలా.. వద్దా అన్న అంశంపై  పీఆర్సీ సాధన సమితి నేతలు విజయవాడలో సమావేశమయ్యారు. బండి శ్రీనివాస్, బొప్పరాజు, సూర్యనారాయణ, వెంకట్రామిరెడ్డి భేటీకి హాజరయ్యారు. సమావేశం అనంతరం పీఆర్సీ సాధన సమితి నేతలు మీడియాతో మాట్లాడారు.. ‘‘ ప్రభుత్వంతో చర్చలకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నాం. జీవోలు రద్దు చేసే వరకు చర్చలకు వెళ్లకూడదనుకుంటున్నాం. జీవోలు రద్దు చేయాలని.. ఈమేరకు మంత్రుల కమిటీకి లేఖ రాయాలని నిర్ణయించాం’’ అని తెలిపారు. మరోవైపు ఉద్యోగసంఘాల నేతలతో చర్చించేందుకు మంత్రుల కమిటీ సచివాలయానికి చేరుకుంది.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని