బ్రేకింగ్

breaking
25 Jan 2022 | 18:28 IST

‘‘జీవన్‌రెడ్డిని ఓడించకపోతే నా పేరు అర్విందే కాదు’’

నిజామాబాద్‌: నందిపేట్‌ మండలంలో తనపై జరిగిన దాడి పిరికి పందల చర్యని ఎంపీ ధర్మపురి అర్వింద్‌ మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఆర్మూర్‌ నుంచి పోటీ చేస్తానని, ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డిని 50 వేల మెజారిటీతో ఓడిస్తానని వెల్లడించారు. ‘‘ఎన్నికల్లో జీవన్‌రెడ్డిని ఓడించకపోతే నా పేరు ధర్మపురి అర్విందే కాదు..  ఇది నా సవాల్‌. తెరాసను రాజకీయంగా ఎదుర్కొంటా. సెల్‌ఫోన్లతో రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొడతాం. నాపై జరిగిన దాడిలో పోలీసు కమిషనర్‌ పాత్ర ఉంది’’ అని అర్వింద్‌ ఆరోపించారు. 

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని