బ్రేకింగ్

breaking
04 Feb 2022 | 11:13 IST

నీట్‌ పీజీ పరీక్ష వాయిదా

దిల్లీ: నీట్‌ పీజీ ప్రవేశ పరీక్షను కేంద్రం వాయిదా వేసింది. ఆరు నుంచి ఎనిమిది వారాలపాటు వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. గతంలో ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 12వ తేదీ నుంచి నీట్‌ పీజీ పరీక్ష జరగాల్సి ఉంది. మరోవైపు నీట్- 2022 నిర్వహణ విషయమై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. నీట్ పీజీ 2021 కౌన్సిలింగ్‌కు హాజరయ్యే విద్యార్థుల్ని దృష్టిలో పెట్టుకుని ఈ పరీక్ష తేదీ వాయిదా వేయాలని కోరుతూ.. ఆరుగురు వైద్య విద్యార్థులు పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

మరిన్ని

తాజా వార్తలు