బ్రేకింగ్

breaking
10 Feb 2022 | 20:26 IST

హిజాబ్‌ వివాదం.. మద్రాస్‌ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

చెన్నై: హిజాబ్‌ వివాదం నేపథ్యంలో మద్రాస్‌ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేశం ముఖ్యమా, మతం ముఖ్యమా అని ప్రశ్నించింది. ఇది ఒకే దేశమా, లేక మతం ఆధారంగా విభజనకు గురైందా? అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆలయాల్లోకి హిందువేతరులను నిషేధించాలని మద్రాస్‌ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. భారత్‌ లౌకిక దేశమని గుర్తుంచుకోవాలని సూచించింది. దేశాన్ని మతం పేరుతో విభజనకు కుట్ర జరుగుతున్నట్లు అనిపిస్తోందని అభిప్రాయపడింది.

మరిన్ని

తాజా వార్తలు