బ్రేకింగ్

breaking
29 Mar 2022 | 16:31 IST

రేపు హరీశ్‌రావు వంతూ వస్తుంది: ఈటల

సిద్దిపేట: తెలంగాణలో బీసీలకు 33% రిజర్వేషన్‌ అమలు చేయాలని భాజపా నేత ఈటల రాజేందర్‌ డిమాండ్‌ చేశారు. సిద్దిపేటలో భాజపా ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో జరిగిన బీసీ చైతన్య సదస్సులో ఈటల మాట్లాడారు. బీసీలకు రాష్ట్ర బడ్జెట్‌లో ₹5,500 కోట్లు పెట్టి ఎంత ఖర్చు చేశారని ప్రశ్నించారు. మరోవైపు ప్రశాంత్‌ కిషోర్‌ ఆలోచనలకు తెలంగాణలో ఓట్లు రాలవని ఎద్దేవా చేశారు. ‘‘₹వేల కోట్ల భూమలు అమ్మి పాలన సాగిస్తున్నారు. తెరాస ఉన్నంత వరకు కేసీఆర్‌ కుటుంబ సభ్యులే సీఎం అవుతారు. నా ఎదుగుదలను ఓర్వలేక తుంచే ప్రయత్నం చేశారు. రేపు హరీశ్‌రావు వంతు కూడా వస్తుంది’’ అని ఈటల విమర్శించారు. 

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని