బ్రేకింగ్

breaking
23 May 2022 | 22:59 IST

మహిళల టీ20: చేతులెత్తేసిన మంధాన సేన..

పుణె: మహిళల టీ20 టోర్నీ తొలి మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్‌ సేన తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో 49 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసి 164 పరుగుల లక్ష్యాన్ని హర్మన్‌ప్రీత్‌ సేన నిర్దేశించింది. అనంతరం లక్ష్య చేధనలో మంధాన జట్టు చతికిలపడిపోయింది. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 114 పరుగులకే పరిమితమైంది. బ్యాటింగ్‌లో మంధాన (34) కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడగా.. రెడ్రీజీయస్‌(24), మాథ్యూస్‌(18) తప్పితే అందరూ చేతులెత్తేశారు. హర్మన్‌ప్రీత్‌ జట్టు బౌలర్లలో పూజా వస్త్రాకర్‌ 4 వికెట్లు తీయగా.. అలనా కింగ్‌ 2, మేఘన సింగ్‌, సోఫీ తలో వికెట్‌ పడగొట్టారు.

మరిన్ని

తాజా వార్తలు