బ్రేకింగ్

breaking
27 Jun 2022 | 19:20 IST

‘అమ్మఒడి’లో ల్యాప్‌టాప్‌కు బదులు ట్యాబ్‌లు!

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్న అమ్మఒడి పథకంలో మరో కోత పడింది. అమ్మఒడిలో నగదుకు బదులుగా ల్యాప్‌టాప్‌ ఇచ్చే విధానానికి ప్రభుత్వం స్వస్తి పలికింది. బైజూస్‌తో ఒప్పందంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకే ట్యాబ్‌లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొమ్మిది నుంచి 12వ తరగతి చదివే వారికి గతంలో అమ్మఒడికి బదులుగా ల్యాప్‌టాప్‌లు ఇస్తామని ప్రకటించడంతో 8,21,655 మంది దరఖాస్తులు చేసుకున్నారు. అయితే, ల్యాప్‌టాప్‌ ధర దాదాపు రూ.26 వేల వరకు ఉండటంతో ఆ ఆలోచనను ప్రభుత్వం విరమించుకున్నట్టు తెలుస్తోంది.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని