బ్రేకింగ్

breaking
28 Jun 2022 | 15:01 IST

TS: జులై 1న టెట్‌ ఫలితాలు

హైదరాబాద్‌: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) ఫలితాల విడుదల తేదీపై స్పష్టత వచ్చింది. టెట్‌ ఫలితాలను జులై 1న విడుదల చేయాలని సంబంధిత అధికారులను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. ఈ నెల 27నే టెట్‌ ఫలితాలు వెల్లడిస్తామని టెట్‌ నోటిఫికేషన్‌లో తొలుత స్పష్టం చేశారు. దీనిపై ఆదివారం రాత్రివరకు అధికారికంగా ఇటువంటి ప్రకటన విడుదల చేయలేదు. తాజాగా ఫలితాల విడుదలపై విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా టెట్‌ పేపర్‌-1కు 3,18,506 (90.62శాతం), పేపర్‌-2కు 2,51,070 (90.35శాతం) మంది అభ్యర్థులు హాజరయ్యారు.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని