బ్రేకింగ్

breaking
29 Jun 2022 | 20:34 IST

సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో ఆంక్షలు

హైదరాబాద్‌: ప్రధాని మోదీ సహా కేంద్రమంత్రుల రాక సందర్భంగా సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఆంక్షలు, నిషేదాజ్ఞలు విధించారు. మాదాపూర్‌ హెచ్‌ఐసీసీ నోవాటెల్‌ చుట్టుపక్కల 5 కి.మీ వరకు డ్రోన్లు, పారాగైడర్లు, మైక్రోలైట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల వంటివి ఎగరడాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్టు సీపీ స్టీఫెన్‌ రవీంద్ర వెల్లడించారు. రేపు ఉదయం 6 గంటల నుంచి జులై 4వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఈ నిషేదాజ్ఞలు అమల్లో ఉంటాయన్నారు. అలాగే జులై 1 నుంచి 4 వరకు సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని, ఐదుగురు కంటే ఎక్కువ మంది గుమికూడరాదని ఆదేశాలు జారీ చేశారు.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని