బ్రేకింగ్

breaking
02 Jul 2022 | 14:04 IST

వికాసం పేరుతో దేశాన్ని నాశనం చేశారు: కేసీఆర్‌

హైదరాబాద్: మోదీ పాలనలో అవినీతిపరులు పెరిగారని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. ‘‘వికాసం పేరుతో దేశాన్ని నాశనం చేశారు. మోదీ.. ఎంత నల్లధనం వెనక్కి తీసుకువచ్చారో చెప్పాలి. నల్లధనం నియంత్రణ కాదు.. రెట్టింపైంది.. ఇదేనా వికాసం. అవినీతి రహిత భారత్ అని పెద్దపెద్ద మాటలు చెప్పారు. నల్లధనం వెనక్కి తీసుకొచ్చి ₹15లక్షలు ఖాతాలో వేస్తామన్నారు. ఏ ఒక్కరి ఖాతాలోనైనా ₹15లక్షలు పడ్డాయా? మోదీ.. దోస్తులకే తప్ప ప్రజలకు చేయాలన్న ఆలోచన లేదు. మోదీ పాలనలో అన్నీ స్కామ్‌లే.. అంతా తిరోగమనమే. డాలర్‌తో పోలిస్తే రూపాయి ఎందుకు పడిపోయింది’’ అని కేసీఆర్‌ ప్రశ్నించారు.

మరిన్ని

తాజా వార్తలు