బ్రేకింగ్

breaking
03 Jul 2022 | 14:02 IST

రేపు సంచలన ప్రకటన చేస్తా: జగ్గారెడ్డి

హైదరాబాద్: రాహుల్‌గాంధీ పర్యటన తర్వాత కూడా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి తీరు మారలేదని సంగారెడ్డి ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి అన్నారు. ‘‘యశ్వంత్‌ సిన్హా పర్యటనపై ఎమ్మెల్యేలతో రేవంత్‌ చర్చించలేదు. ఎలాంటి సమావేశం ఏర్పాటు చేయకుండానే మాతో చర్చించినట్లు చెప్పారు. గోడకు వేసి కొడుతా అని అవమానపరిచేలా రేవంత్‌ మాట్లాడుతున్నారు. అలా రెచ్చగొట్టడం వల్లే నేను మీడియా ముందు మాట్లాడాను. రాజకీయ యుద్ధం చేయాలంటే వ్యూహం ఉండాలి. రేపు ఒక సంచలన ప్రకటన చేయబోతున్నాను’’ అని జగ్గారెడ్డి వెల్లడించారు.

మరిన్ని

తాజా వార్తలు