బ్రేకింగ్

breaking
08 Aug 2022 | 16:41 IST

బ్యాడ్మింటన్‌లో మరో స్వర్ణం.. ఎవరికంటే?

బర్మింగ్‌హామ్‌: కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌ తన ఖాతాలో మరో స్వర్ణం వేసుకుంది. పురుషుల బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌లో లక్ష్య సేన్‌ స్వర్ణ పతకం కైవసం చేసుకున్నాడు. మలేసియా ఆటగాడు జె యంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్ష్య సేన్‌ 19-21, 21-9, 21-16తో విజయం సాధించాడు. దీంతో 2022 కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌ మొత్తం 57 పతకాలు సాధించింది. అందులో 20 స్వర్ణాలు ఉండగా 15 రజతాలు, 22 కాంస్యాలున్నాయి.

మరిన్ని

తాజా వార్తలు