బ్రేకింగ్

breaking
16 Aug 2022 | 15:41 IST

లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్‌మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 379.43 పాయింట్లు లాభపడి 59,842.21 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 127.10 పాయింట్లు లాభపడి 17,825.25 దగ్గర స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 79.35గా ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, అదానీ పోర్ట్స్‌, బీపీసీఎల్, మారుతీ సుజుకీ, టాటా మోటార్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌, అల్ట్రాటెక్‌,  హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో ముగిశాయి. హిందాల్కో, ఎస్‌బీఐ, భారతీ ఎయిర్‌టెల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, టీసీఎస్‌ షేర్లు నష్టాల్లో ట్రేడయ్యాయి.

మరిన్ని

తాజా వార్తలు