బ్రేకింగ్

breaking
16 Aug 2022 | 19:09 IST

జగన్‌వి పదో తరగతి పాస్‌.. డిగ్రీ ఫెయిల్‌ తెలివితేటలు

అమరావతి: ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌వి పదో తరగతి పాస్‌.. డిగ్రీ ఫెయిల్‌ తెలివితేటలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. ‘‘వైకాపా హయాంలో రాష్ట్రానికి వచ్చిన వాటికంటే వెళ్లిన పరిశ్రమలే ఎక్కువ. పెట్టుబడులు పెట్టాలంటే ముందుగా సీఎం వాటా ఎంత అనే చర్చ వస్తుంది. రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలపై శ్వేతపత్రం విడుదల చేస్తే చర్చకు సిద్ధం. ఈడీ, ఐటీ, సీబీఐకి భయపడి దిల్లీలో జగన్‌ తలవంచారు. సీఎంకు సంబంధించిన పెద్ద కుంభకోణం వచ్చేవారం బయటపెడతా’’ అని లోకేశ్‌ వెల్లడించారు.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని