బ్రేకింగ్

breaking
28 Sep 2022 | 08:19 IST

పీఎఫ్‌ఐపై కేంద్రం నిషేధం

దిల్లీ: పీఎఫ్‌ఐ(పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా)పై కేంద్రం నిషేధం విధించింది. పీఎఫ్‌ఐ, దాని అనుబంధ సంస్థలపై ఐదేళ్లపాటు నిషేధం విధిస్తూ కేంద్ర హోంశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది. యూఏపీఏ చట్టం కింద ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులను అందించడంతోపాటు యువతకు శిక్షణ ఇస్తున్నారనే ఆరోపణలపై పీఎఫ్‌ఐ కార్యాలయాలపై దేశవ్యాప్తంగా భారీ ఆపరేషన్‌ను కేంద్ర హోంశాఖ చేపట్టిన విషయం తెలిసిందే. ఇటీవల పట్నాలో ప్రధాని మోదీ హత్యకు కూడా కుట్ర చేసినట్లు ఆరోపణలన్నాయి.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని