బ్రేకింగ్

breaking
30 Sep 2022 | 15:17 IST

‘‘KCR, హరీశ్‌ మధ్య గొడవలుంటే వాళ్లే చూసుకోవాలి’’

అమరావతి: ఉపాధ్యాయుల పట్ల ఏపీ ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోందని, కేసులు పెట్టి లోపల వేస్తుందని తెలంగాణ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ స్పందించారు. ‘‘కేసీఆర్‌, హరీశ్‌రావును చూసి మేం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఏపీలో మూడేళ్లలో వైకాపా ఏం చేసిందో ప్రజలకు తెలుసు. ఎనిమిదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్‌.. తెలంగాణకు ఏం చేశారో చెప్పాలి. ఏపీ భవన్‌లో అధికారిని హరీశ్‌రావు ఎలా తన్నారో అందరూ చూశారు. హరీశ్‌రావు, కేసీఆర్‌ మధ్య గొడవలు ఉంటే వాళ్లే చూసుకోవాలి. ఏపీపై విమర్శలు సరికాదు’’ అని అన్నారు.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని