బ్రేకింగ్

breaking
03 Oct 2022 | 11:22 IST

Alert: నగరంలో నేడు ట్రాఫిక్‌ ఆంక్షలు

హైదరాబాద్: తెలంగాణలో నేటితో బతుకమ్మ సంబరాలు ముగియనున్నాయి. ఈ సందర్భంగా ఎల్బీ స్టేడియంలో సద్దుల బతుకమ్మ వేడుకలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నగరంలో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. నిజాం కాలేజ్‌, బషీర్‌బాగ్ కూడలి, ఆర్‌బీఐ, లక్డీకపూల్, తెలుగుతల్లి కూడలి వైపు వెళ్లొద్దన్నారు. ఎల్బీ స్టేడియంకు వచ్చే వారి కోసం పలుచోట్ల పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. ట్రాఫిక్‌ అప్‌డేట్స్‌ కోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల సోషల్ మీడియా ఫాలో అవ్వాలని సూచించారు.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని