బ్రేకింగ్

breaking
05 Oct 2022 | 13:30 IST

భారాసగా తెరాస.. తీర్మానంపై కేసీఆర్ సంతకం

హైదరాబాద్: తెరాస అధినేత, సీఎం కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించారు. తెరాసను భారత్‌ రాష్ట్ర సమితి(భారాస)గా మారుస్తున్నట్లు ఆయన అధికారికంగా వెల్లడించారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో పార్టీ పేరు మార్పు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈమేరకు పేరు మారుస్తూ తెరాస అధినేత ప్రతిపాదించిన తీర్మానానికి సభ్యులు మద్దతు తెలిపారు. అనంతరం ఆ తీర్మానంపై కేసీఆర్‌ సంతకం చేశారు. 

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని