బ్రేకింగ్

breaking
29 Nov 2022 | 15:33 IST

లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్‌మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 149.77 పాయింట్లు లాభపడి 62,644.49 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 43.30 పాయింట్లు లాభపడి 18,608.90 దగ్గర స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 81.73గా ఉంది. నెస్లే, డా.రెడ్డీస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, టాటా స్టీల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఐటీసీ, ఇన్ఫోసిస్‌ షేర్లు లాభాల్లో ట్రేడయ్యాయి. రిలయన్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, టీసీఎస్‌, విప్రో, టెక్‌ మహీంద్ర, మారుతీ, ఏషియన్ పెయింట్స్‌ షేర్లు నష్టాలతో ముగిశాయి.

మరిన్ని

తాజా వార్తలు