బ్రేకింగ్

breaking
30 Nov 2022 | 13:16 IST

మంత్రి గంగుల, ఎంపీ రవిచంద్రకు CBI నోటీసులు

దిల్లీ: తెరాస నేతలకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్‌, తెరాస రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్రకు నోటీసులు జారీ చేసి, రేపు విచారణకు హాజరుకావాలని కోరింది. తెలంగాణలో సీబీఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించిన నేపథ్యంలో దిల్లీలో జరిగే విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. సీబీఐ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని తెలిపింది. గ్రానైట్‌ వ్యాపారాలకు సంబంధించిన వ్యవహారాలపై గంగుల కమలాకర్‌, రవిచంద్రను సీబీఐ అధికారులు ప్రశ్నించనున్నట్లు సమాచారం.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని