బ్రేకింగ్

breaking
02 Dec 2022 | 13:53 IST

ఆసీస్‌తో టీ20 సిరీస్‌కు ఆదోని అమ్మాయి

ఆదోని మార్కెట్‌: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన అంజలి శర్వాణి  భారత మహిళా క్రికెట్‌ జట్టుకు ఎంపికైంది. డిసెంబర్‌ 9 నుంచి 20 వరకు స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరగనున్న 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఆమె పాల్గొననుంది. ఈమేరకు బీసీసీఐ ట్వీట్ చేసిన భారత మహిళా క్రికెట్‌ జట్టు జాబితాలో అంజలి పేరు ఉంది.  స్థానిక మిల్టన్‌ ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు ఆమె చదువుకుంది. అంజలి భారత మహిళా క్రికెట్‌ జట్టుకు ఎంపిక కావడం పట్ల ఆ ప్రాంత వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
 

మరిన్ని

తాజా వార్తలు