బ్రేకింగ్

breaking
03 Dec 2022 | 14:07 IST

టికెట్లు ఉన్నవారికే వైకుంఠ ద్వార దర్శనం: తితిదే

తిరుమల: వైకుంఠ ఏకాదశికి టికెట్లు ఉన్న భక్తులనే తిరుమలకు అనుమతిస్తామని తితిదే ఈవో ధర్మారెడ్డి అన్నారు. జనవరి 2న వైకుంఠ ద్వార దర్శనం ఉంటుందని.. 11వ తేదీ వరకు వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంటాయని ధర్మారెడ్డి వెల్లడించారు. రోజుకు 25వేల చొప్పున ₹300 ప్రత్యేక ప్రవేశ టికెట్లను ఆన్‌లైన్‌లో జారీ చేయనున్నట్లు చెప్పారు. తిరుపతిలోని 9 ప్రాంతాల్లో రోజుకు 50 వేల చొప్పున సర్వదర్శన టోకెన్లు జారీ చేస్తామన్నారు. మొత్తంగా 7.5 లక్షల మందికి సర్వదర్శనం ద్వారా వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నామని ఈవో తెలిపారు.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని