బ్రేకింగ్

breaking
09 Dec 2022 | 13:31 IST

కేసీఆర్‌ సంతకం.. భారత్‌ రాష్ట్ర సమితి ఆవిర్భావం

హైదరాబాద్: దేశ రాజకీయ యవనికపై కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. తెలంగాణ సీఎం కేసీఆర్‌ సారథ్యంలో భారత్‌ రాష్ట్ర సమితి (భారాస) ఏర్పాటైంది. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పేరు భారత్‌ రాష్ట్ర సమితి (భారాస)గా మార్పు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించింది.  ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన భారాస ఆవిర్భావ వేడుకల్లో ఈసీ పంపిన లేఖకు అంగీకారం తెలుపుతూ సీఎం కేసీఆర్‌ సంతకం చేశారు. దీంతో భారత్‌ రాష్ట్ర సమితి అమల్లోకి వచ్చినట్లయింది. కేసీఆర్‌ సంతకం చేసిన లేఖను అధికారికంగా ఈసీకి పంపనున్నారు.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని